Asianet News TeluguAsianet News Telugu

సంచలన తీర్పు.. తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోకపోతే ఆస్తి వెనక్కి!

Madras High Court: తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. తల్లిదండ్రులు ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ... ఆ ఆస్తులను తిరిగి తీసుకోవచ్చునని సంచలన తీర్పు వెలువరించింది. 

Madras High Courts Key Judgment Parents Can Take Back Property Given To Children KRJ
Author
First Published Sep 11, 2023, 6:31 AM IST

Madras High Court: తల్లిదండ్రులకు సరిగ్గా పట్టించుకోని పిల్లలకు మద్రాసు హైకోర్టు గట్టి షాకిచ్చింది. తల్లిదండ్రులు ఆస్తిని రాసి ఇచ్చిన తరువాత.. కన్నబిడ్డలు తమను పట్టించుకోకపోతే.. వారి పేరు మీద ఉన్న ఆస్తిని లేదా వారికి రాసి ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలు తమని పట్టించుకోవడం లేదని భావిస్తే.. పిల్లల పేరు మీద ఉన్న ఆస్తిని ఏకపక్షంగా రద్దు చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. తల్లిదండ్రుల ఇష్టప్రకారం.. వారిని ఆస్తిని ఇష్టం ప్రకారం మార్చుకోవచ్చుననీ, తమపై నిర్లక్ష్యంగా వ్యవహరించే బిడ్డల నుంచి తన ఆస్తి నుండి విడదీయవచ్చని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం పేర్కొంది.

తల్లిదండ్రులకు ఆహారం, ఆశ్రయం కల్పించడమే కాకుండా వారు సురక్షితంగా, గౌరవంగా సాధారణ జీవనం సాగించేలా చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని కోర్టు పేర్కొంది. తిరుపూర్ ఆర్డీఓ నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టు సమర్థిస్తూ ఓ మహిళకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయమూర్తి ఎస్‌ఎం సుబ్రమణ్యం ఆదేశాల మేరకు.. తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుందనీ,  తల్లిదండ్రుల అవసరాలకు అనుగుణంగా సాధారణ జీవితాన్ని గడపడానికి వీలుగా సౌకర్యాలు కల్పించాలని అన్నారు.   తల్లిదండ్రులను కాపాడుకోవడం పిల్లల బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది. 

సీనియర్ సిటిజన్ల ప్రాణాలకు, గౌరవానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వంలోని సమర్థ అధికారులు భావిస్తున్నారని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం.. అటువంటి పౌరుల ప్రాణాలకు మరియు ఆస్తులకు రక్షణ కల్పించడం జిల్లా కలెక్టర్ యొక్క విధి అని న్యాయమూర్తి అన్నారు. న్యాయస్థానం, 'ఒక సీనియర్ సిటిజన్ దాఖలు చేసిన ఫిర్యాదును తేలికగా తీసుకోలేము, సీనియర్ సిటిజన్ల గౌరవాన్ని కాపాడేందుకు, భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి అన్నారు. 

ఇంతకీ కేసు నేపథ్యమేంటీ..

తమిళనాడులోని తిరుప్పూర్‌లో నివాసం ఉంటున్న షకీరా బేగం తన కుమారుడు మహమ్మద్‌ దయాన్‌ పేరు మీద కొంత ఆస్తిని బదిలీ చేసింది. అయితే కుమారుడు తన బాగోగులను పట్టించుకోకపోవడంతో ఆమె సబ్‌ రిజిస్ట్రార్‌ ను ఆశ్రయించింది. తన కుమారుడి పేరు మీద ఉన్న ఆస్తిని బాగా చూసుకుంటాడనే షరతుతో ఇచ్చానని చెప్పింది.

ఇప్పుడు తన కొడుకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం లేదని,  తాను రాసిన సెటిల్‌మెంట్‌ డీడ్‌ను రద్దు చేయాలని కోరారు. దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ ఈ డీడ్‌ను రద్దు చేశారు. ఆ నిర్ణయాన్ని ఆమె కొడుకు మహమ్మద్‌ దయాన్‌ సవాల్‌ చేశారు. తన తల్లి సెటిల్‌మెంట్‌ డీడ్‌ను ఎటువంటి షరతులు లేకుండా రాశారని తెలిపారు. కానీ, దయాన్‌ వాదనలను జస్టిస్‌ సుబ్రహ్మణ్యం తోసిపుచ్చారు. బాధిత తల్లిదండ్రులు లేదా వృద్ధులు ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని మద్రాస్‌ హైకోర్టు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios