రాముడు ఒక వ్యక్తి కాదు.. ఒక జీవన విధానం..: 'హే రామ్' పై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
Agar Malwa: 'హేరామ్' అంటే భావాన్ని వివరించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. రాముడు అంటే ఒక వ్యక్తి కాదనీ, ఒక జీవనవిధానం అని తెలిపారు. గాంధీజీ 'హేరామ్' అని చెప్పినప్పుడు శ్రీరాముడి భావాలను మనలోనికి తీసుకురావాలనీ, మనం కూడా అదే భావాలతో జీవితాన్ని గడపాలని భావించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అన్నారు.
Bharat Jodo Yatra: శ్రీరాముని గురించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'హే రామ్' అంటే భావాన్ని వివరించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. రాముడు అంటే ఒక వ్యక్తి కాదనీ, ఒక జీవన విధానం అని తెలిపారు. గాంధీజీ 'హే రామ్' అని చెప్పినప్పుడు శ్రీరాముడి భావాలను మనలోనికి తీసుకురావాలనీ, మనం కూడా అదే భావాలతో జీవితాన్ని గడపాలని భావించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అన్నారు.
వివరాల్లోకెళ్తే... ప్రస్తుతం రాహుల్ గాంధీ కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించారు. ప్రజా సమస్యలు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపుతూ.. దేశ ప్రజలను ఏకం చేయడానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. తమిళనాడులోని కన్యాకుమరి నుంచి ప్రారంభమైన రాహుల్ గాంధీ పాదయాత్ర కాశ్మీర్ లో ముగుస్తుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్ లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. రాష్ట్రంలోని అగర్ మాల్వా పర్యటన సందర్భంగా శుక్రవారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ.. శ్రీరాముడిని ప్రస్తావిస్తూ, 'రాముడు సన్యాసి అని ఒక పండిట్ జీ చెప్పాడనీ పేర్కొన్న ఆయన... రాముడు ఒక వ్యక్తి కాదు.. ఒక జీవన విధానం. ప్రపంచం మొత్తానికి ప్రేమ, సౌభ్రాతృత్వం, గౌరవం, తపస్సు మార్గాలను చూపించాడని తెలిపారు.
అలాగే, జాతిపిత మహాత్మా గాంధీ గురించి కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. గాంధీజీ 'హే రామ్' అని చెప్పినప్పుడు, శ్రీరాముడి భావాలను మనలోనికి తీసుకురావాలనీ, అదే భావాలతో మనం జీవితాన్ని గడపాలని ఆయన కోరుకున్నారని తెలిపారు. ఇదే 'హే రామ్' అంటే అని వివరించారు. కాగా, మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అక్కడి ప్రజలు ప్రత్యేక ఘన స్వాగతం పలికారు. "జై సియారాం, జై సీతా జై రాం అంటే ఏమిటి?.. సీత, రాముడు ఒక్కటే, అందుకే జై సియారాం లేదా సీతారాం అనే నినాదం. సీత గౌరవం కోసం పోరాడాడు. సమాజంలో సీతకు ఉండాల్సిన స్థానాన్ని గౌరవిస్తామని" అన్నారు.
అగర్ మాల్వాలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక తమ్ముడిని మరో తమ్ముడితో, ఒక కులం మరో తమ్ముడితో గొడవపడేలా చేస్తారు. దేశంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగితే దేశానికే నష్టం అని అన్నారు. ఒకవైపు మేం దేశభక్తులమని చెబుతూనే మరోవైపు పోరాడుతున్నామని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్లోని యువతకు ఉపాధి లభించదు, మిగిలిన భారతదేశంలోని యువత ఉపాధి పొందలేరు. అతనికి ఇద్దరుముగ్గురు స్నేహితులు ఉన్నారు. వారికోసమే.. సాధారణ ప్రజలకు ఏం ప్రయోజనం పొందలేరు అంటూ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
ఆర్ఎస్ఎస్-బీజేపీ వాళ్లు జై సియారామ్ ఎందుకు అనరు?
బీజేపీ వాళ్లు జై శ్రీరామ్ అంటే రాముడు అంటారు కానీ, జై సియారాం, హే రామ్ అని అనరు అని రాహుల్ గాంధీ అన్నారు. ఎందుకంటే భాజపా, ఆర్ఎస్ఎస్ వ్యక్తులు రాముడి స్ఫూర్తితో జీవించడం లేదు. రాముడు ఎవరికీ అన్యాయం చేయలేదు. కనెక్ట్ చేసే పని చేశాడు. అందరికీ సహాయం చేశాడు అని అన్నారు.