Lucknow: ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. యూపీలో సుపరిపాలన, సుస్థిర పాలన కొనసాగుతున్నదని తెలిపారు.
UP Global Investors Summit-2023: సుపరిపాలన, సుస్థిరత కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ప్రజలకు మంచి పాలన అందించడాని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ కు ఇన్వెస్టర్లందరినీ ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. యూపీలో సుపరిపాలన, సుస్థిర పాలన కొనసాగుతున్నదని తెలిపారు. లక్నోలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన, సుస్థిరత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రశంసించారు.
"ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కు ఇన్వెస్టర్లందరినీ ఆహ్వానిస్తున్నాను. నేడు ఉత్తర ప్రదేశ్ సుపరిపాలన, శాంతి, శాంతిభద్రతలు-స్థిరత్వానికి ప్రసిద్ధి చెందింది" అని లక్నోలో జరిగిన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ప్రధాని మోడీ తన ప్రారంభోపన్యాసంలో అన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన సులభతర వాణిజ్యానికి ఎంతగానో దోహదపడిందన్నారు. 'మౌలిక సదుపాయాలతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం యూపీ తన 'సోచ్ అండ్ అప్రోచ్'ను మార్చింది. ఇది నవ భారత వృద్ధికి నాంది పలుకుతోంది. విద్యుత్ నుంచి కనెక్టివిటీ వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్రాభివృద్ధిని సాధిస్తోంది' అని ప్రధాని పేర్కొన్నారు.
"ఆరోగ్యం, విద్య, హరిత వృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాల మెరుగుదల ఉత్తరప్రదేశ్ లో పెట్టుబడిదారులకు గొప్ప అవకాశాలను కల్పిస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, హరిత వృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు భారత్ లో పెట్టుబడిదారులకు గొప్ప అవకాశాలు. ఈ రోజు, భారతదేశం సంస్కరణలను బలవంతంతో కాకుండా, నమ్మకంతో అమలు చేస్తోంది" అని లక్నోలో జరిగిన సమ్మిట్ లో ప్రధాని అన్నారు. ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ సహా యూపీ క్యాబినెట్ మంత్రులందరూ ప్రధాని ప్రారంభించిన ఈ మెగా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇన్వెస్టర్ యూపీ 2.0 అనేది ఉత్తర ప్రదేశ్ లో సమగ్ర, పెట్టుబడి-కేంద్రీకృత, సేవా-ఆధారిత పెట్టుబడి పర్యావరణ వ్యవస్థ. ఇది పెట్టుబడిదారులకు సంబంధిత, బాగా నిర్వచించబడిన, ప్రామాణిక సేవలను అందించడానికి ప్రయత్నిస్తుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాలుపంచుకున్నారు.
