Asianet News TeluguAsianet News Telugu

పూణెలో లవ్ జిహాద్ కేసు ! ‘ది కేరళ స్టోరీ’ చూశాక బాలిక కుటుంబం కుట్రను గ్రహించింది - బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్

పూణెలో నాలుగేళ్ల కిందట ఓ ముస్లిం బాలుడు 16 ఏళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని, తరువాత ఆమెను తన మతంలోకి మార్చి‘లవ్ జిహాద్’కు పాల్పడ్డాడని బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్ ఆరోపించారు. బాధితురాలని ప్రస్తుతం రక్షించామని, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. 

Love Jihad case in Pune! The girl's family realized the conspiracy after watching 'The Kerala Story' - BJP MLA Gopichand..ISR
Author
First Published May 27, 2023, 11:15 AM IST

పూణెలో ఓ లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మంచార్ గ్రామంలో నాలుగేళ్ల క్రితం 16 ఏళ్ల బాలికను మైనారిటీ వర్గానికి చెందిన బాలుడు అపహరించాడని, అయితే బాధితురాలని మే 16వ తేదీన రక్షించామని బీజేపీ నేత గోపీచంద్ పడాల్కర్ తెలిపారు. నిందితుడిని జావేద్ గా గుర్తించామని, బాధితురాలిని కాపాడిన ఒక రోజు తరువాత అతడిని పోలీసులు అరెస్టు చేశారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. తమ బిడ్డను వెతికిపెట్టాలని నాలుగేళ్ల క్రితమే మంచార్ పోలీసులకు తాము పలుమార్లు విన్నవించామని, అయినా వారు పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. 

పల్నాడులో దారుణం.. మద్యం మత్తులో కుమారుడితో గొడవ.. తల నరికి, సంచిలో ఉంచి ఊరంతా తిరిగిన తండ్రి..

బీజేపీ నేత, ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్ శుక్రవారం పుణెలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇందులో బాధిత కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం తమ కూతురు అపహరణకు గురైందని చెప్పారు. కానీ ఆ సమయంలో పోలీసులు సహాయం చేయలేదని వారు ఆరోపించారు. తమ బిడ్డను తప్పుదోవ పట్టించి, కిడ్నాప్ చేసి పలు ప్రాంతాలకు తీసుకెళ్లారని తెలిపారు.

హిందూ యువకుడితో ముస్లిం యువతి డిన్నర్ కు వెళ్లిందని మూక దాడి.. రక్షించేందుకు వచ్చిన ఇద్దరిని పొడిచిన దుండగులు

అయితే ఆరు నెలల క్రితం బాలిక, యువకుడు మంచార్ కు తిరిగి వచ్చారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయం తమకు తెలియడంతో తాము జావేద్ ఇంటికి వెళ్లి చూశామని చెప్పారు. కానీ ఆ సమయంలో తమ కూతురు బురఖా ధరించి కనిపించిందని తెలిపారు. కాగా.. ఇటీవల విడుదలైన 'ది కేరళ స్టోరీ' సినిమా చూసి బాలిక కుటుంబం కుట్రను గ్రహించిందని బీజేపీ నేత, ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్ తెలిపారు. తరువాత బాలికను రక్షించామని, నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. నిందితుడు ప్రస్తుతం ఎరవాడ జైలులో ఉన్నాడని తెలిపారు. 

సెల్పీ తీసుకుంటుండగా రిజర్వాయర్ లో ఫోన్ పడిపోయిందని.. 21 లక్షల లీటర్ల నీటిని తోడేసిన గవర్నమెంట్ ఆఫీసర్..

మహారాష్ట్రలో అనేక ‘లవ్ జిహాద్’ కేసులు నమోదవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులపై ఓ కమిటీ దర్యాప్తు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో లవ్ జిహాద్, మతమార్పిడులకు వ్యతిరేకంగా ఏక్ నాథ్ షిండే - బీజేపీ ప్రభుత్వం బలమైన చట్టాన్ని తీసుకువస్తుందని పడాల్కర్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios