Asianet News TeluguAsianet News Telugu

పల్నాడులో దారుణం.. మద్యం మత్తులో కుమారుడితో గొడవ.. తల నరికి, సంచిలో ఉంచి ఊరంతా తిరిగిన తండ్రి..

ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి కుమారుడిని దారుణంగా హతమార్చాడు. మద్యం మత్తులో తల నరికి, దానిని సంచిలో పెట్టుకొని ఊరేగాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Atrocious in Palnadu.. Argued with his son under the influence of alcohol.. Father cut off his head, put it in a bag and wandered around the town..ISR
Author
First Published May 27, 2023, 7:06 AM IST

మద్యం మత్తులో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. కన్న కొడుకు అని కూడా చూడకుండా దారుణంగా హతమార్చాడు. తలను నరికి, దానిని ఓ సంచిలో పెట్టుకొని ఊరంతా తిరిగాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

తెల్లకోటు లేకుండా, హిజాబ్ ఎందుకు ధరించారని డాక్టర్ తో బీజేపీ కార్యకర్త గొడవ.. వీడియో వైరల్.. కేసు నమోదు

వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన బత్తుల వీరయ్య-అలివేలమ్మ భార్యభర్తలు. వీరికి 25 ఏళ్ల అశోక్ అనే కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. వీరిద్దరికి తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేశారు. అయితే జీవనోపాధి కోసం రెండు సంవత్సరాల కిందట అలివేలమ్మ కువైట్ కు వెళ్లింది. వీరయ్య గ్రామంలోనే ఉంటూ కూలీ పనులు చేస్తూ కుమారుడు, కోడలు దగ్గరే ఉండేవాడు. 

కువైట్ వెళ్లిన అలివేలమ్మ ఇక్కడ కుటుంబ పోషణ కోసం అప్పుడప్పుడు డబ్బులు పంపించేది. ఈ క్రమంలోనే నాలుగు రోజుల కిందట కూడా అశోక్ బ్యాంక్ అకౌంట్ లో రూ.5 వేలు వేసింది. ఇదిలా ఉండగా ఇటీవల అశోక్ భార్య తన పుట్టింటికి వెళ్లగా.. అతడు తన తండ్రితో కలిసి ఇంటి వద్దే ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య అవివేలమ్మ పంపిన డబ్బు విషయంలో గొడవ జరిగింది. మద్యం తాగేందుకు తన భార్య పంపిన డబ్బులు ఇవ్వాలని వీరయ్య కుమారుడితో గొడవకు దిగాడు. దీనికి అతడు నిరాకరించాడు.

చల్లటి కబురు.. జూన్ 4న కేరళకు రుతుపవనాలు.. ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఉన్నప్పటికీ సాధారణ వర్షాలు..

ఈ క్రమంలోనే గురువారం రాత్రి కూడా అశోక్, వీరయ్య ఇద్దరూ వేరు వేరుగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నారు. ఈ మత్తులోనే మళ్లీ తండ్రి కుమారులిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తీవ్ర వాగ్వాదంగా మారింది. దీంతో కుమారుడి తలపై వీరయ్య బండతో దాడి చేశాడు. ఆ నొప్పి తట్టుకోలేక అశోక్ కిందపడిపోయాడు. వెంటనే తండ్రి ఇంట్లోకి వెళ్లి ఓ కత్తి తీసుకొచ్చాడు. అనంతరం కుమారుడి తలను నరికాడు. దానిని ఓ బస్తాలో పెట్టుకొని గ్రామంలోని మద్యం షాప్ వద్దకు వెళ్లాడు. అక్కడే మద్యం కొని తాగాడు. 

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవ వేడుక.. రూ.75 స్మారక నాణెం విడుదల చేయనున్న కేంద్రం

తరువాత అక్కడి నుంచి బయలుదేరి గ్రామంలో తిరుగుతూ ‘కుమారుడి తల నరికాను’ అంటూ తాగిన మత్తులో అరిచాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. దీంతో వెంటనే పోలీసులు గ్రామానికి వచ్చారు. వీరయ్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ కు తీసుకొచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ కోటేశ్వరరావు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios