శానిటరీ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడం, రుతుక్రమం విద్య అవగాహన లేకపోవడం వల్ల భారత్ లో ప్రతీ ఐదుగురి బాలికల్లో ఓ బాలిక చదువు మానేస్తున్నారని యునెస్కో సభ్యులు చెప్పారు. కాబట్టి పాఠశాలల్లో రుతుక్రమ విద్యపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
భారతదేశంలో ప్రతీ ఐదుగురిలో ఒకరు రుతుక్రమ విద్యపై అవగాహన లేకపోవడం, శానిటరీ ఉత్పత్తులు అందుబాటు లేకపోవడం వల్ల ప్రతీ ఐదుగురు బాలికల్లో ఒకరు చదువును మధ్యలోనే మానేస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పాఠశాలల్లో పీరియడ్ విద్యను చేర్చాల్సిన అవసరం చెబుతున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జూలై 6వ తేదీన ఎన్నికలు.. బ్రిజ్ భూషణ్ కు ఛాన్స్ ఉందా ? లేదా ?
బాలికల డ్రాపవుట్ రేటును దృష్టిలో ఉంచుకుని యునెస్కో న్యూ ఢిల్లీ, భారతదేశంలోని పీ అండ్ జీ విస్పర్ భాగస్వామ్యంతో ‘‘కీప్ గర్ల్స్ ఇన్ స్కూల్’’ అనే కార్యక్రమం కింద భారతదేశంలో రుతుచక్ర ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణను ప్రోత్సహించడానికి భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా, వారు వైకల్యాలు, లింగం, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, యువకులు, పోషకాహారంతో సహా ఐదు థీమాటిక్ రంగాలపై ఐదు అద్భుతమైన టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్స్ ను ప్రారంభించారు. అలాగే ‘‘కీప్ గర్ల్స్ ఇన్ స్కూల్’’ చొరవ కింద రుతుస్రావ ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణ (ఎంహెచ్హెచ్ఎం) పై సమగ్ర జాతీయ సర్వే, గ్యాప్ అనాలిసిస్ నివేదికను ప్రారంభించారు.
ఈ టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్స్ విడుదల చేయడం వల్ల అభ్యాసకులు, విద్యావేత్తలు, రుతుస్రావం, కమ్యూనిటీ లీడర్లకు రుతుస్రావాన్ని నిర్వహించడంలో సమగ్ర అవగాహన, నైపుణ్య అభివృద్ధి కోసం అనివార్యమైన వనరులు, వ్యూహాలను అందిస్తుంది, అదే సమయంలో దాని సామాజిక ప్రభావం విషయంలో అవగాహన పెంచుతుంది. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ముఖ్య అతిథిగా హాజరుకాగా, పీహెచ్ డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్ డీసీసీఐ) న్యాయవాద భాగస్వామిగా ఉంది.
జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ రెండు భూకంపాలు.. కత్రా, దోడాలో కంపించిన భూమి.. ఆందోనళనకు గురైన స్థానికులు
‘‘పీ అండ్ జీ విస్పర్ ఇండియాతో మా సహకారం రుతుస్రావ ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణకు మా కొనసాగుతున్న నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ సహకారం ద్వారా రుతుస్రావ ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణలో పురోగతిని పెంచడం, ఆరోగ్యకరమైన, మరింత సాధికార భవిష్యత్తు కోసం జ్ఞానం, వనరులకు సమాన ప్రాప్యతను నిర్ధారించడం మా లక్ష్యం’’ అని యునెస్కో న్యూ ఢిల్లీ మల్టీ సెక్టోరల్ ప్రాంతీయ కార్యాలయం ఇన్ఛార్జి అధికారి హెజెకిల్ డ్లామిని అన్నారు.
‘‘భారతదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు రుతుక్రమ విద్య లేకపోవడం, శానిటరీ ప్రొడక్ట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల బడి మానేస్తున్నారు. పాఠశాలలు, కుటుంబాలు, కమ్యూనిటీలలో పీరియడ్ ఎడ్యుకేషన్ అనే అధ్యాయం కనిపించడం లేదు, ఫలితంగా 71 శాతం మంది బాలికలకు పీరియడ్స్ గురించి తెలియదు’’ అని ఫిమేన్ కేర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కేటగిరీ లీడర్ గిరీష్ కళ్యాణరామన్ అన్నారు.
అందుకే రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేశారు - కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్
యునెస్కోతో భాగస్వామ్యంతో పాఠశాలల్లో, ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగపడే పీరియడ్ పాఠ్యప్రణాళికను రూపొందించి, ప్రారంభించడం ద్వారా తమ ప్రయత్నాలను పెంచుకుంటున్నామని అన్నారు. పీరియడ్స్ పై అధ్యాయం ఇకపై మిస్ కాకుండా చూడటమే తమ లక్ష్యమని చెప్పారు. బాలికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పాఠశాల విద్యను పూర్తి చేయడం ద్వారా వారి కలలను సాకారం చేసుకోవడానికి సాధికారత కల్పించడం, పీరియడ్స్ పై అవగాహన లేకపోవడం వల్ల వారు బడి మానేయకుండా నిరోధించడం తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
