Asianet News TeluguAsianet News Telugu

వైద్యురాలిపై హత్యాచారం కేసు ... మమతా బెనర్జీ సర్కార్ ను బోనులో నిలబెట్టిందా..?

 విధి నిర్వహణలో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  ఈ కేసు పశ్చిమ బెంగాల్ పాలన వ్యవస్థపైనా ప్రభావం చూపుతోంది. 

 

Kolkata Doctor Rape and Murder Case: A Dark Chapter in West Bengal Governance AKP
Author
First Published Aug 21, 2024, 10:11 PM IST | Last Updated Aug 21, 2024, 10:16 PM IST

కోల్‌కతా : మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు పశ్చిమ బెంగాల్ పాలనపై ప్రభావం చూపుతోంది. రాాష్ట్ర రాజధాని కోల్‌కతాలో యువ డాక్టర్ పై జరిగిన హత్యాచారం ఘటన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టిఎంసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది.  ఈ వ్యవహారంలో మమతా ప్రభుత్వం వ్యవహరించిన తీరును సుప్రీం కోర్టు ప్రశ్నించడమే కాదు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 

'పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ కేసును పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించింది.'

'పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆర్జీ కర్ ఆసుపత్రిలో దాడులకు ఎలా అనుమతించిందో నమ్మలేకపోతున్నాం.'

'నేర స్థలాన్ని భద్రపరచడం పోలీసుల బాధ్యత.'

'ఉదయం నేరం వెలుగులోకి వచ్చింది, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు.'

'ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, బాధిత కుటుంబానికి మృతదేహాన్ని అందజేయకపోవడం ఆందోళనకరం.'

సుప్రీంకోర్టు ఈ విధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించిన తీరు బెంగాల్‌లో పాలన ఎలా సాగుతోందో స్పష్టంగా తెలియజేస్తోంది.  

 వైద్యురాలి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం

ఆగస్టు 9న ఉదయం ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో మహిళా వైద్యురాలి మృతదేహం లభ్యమైంది. ఆసుపత్రి యాజమాన్యం, పోలీసులు మొదట దీనిని ఆత్మహత్యగా పేర్కొన్నారు. తర్వాత అది అత్యాచారం, హత్య అని తేలింది. ఈ కేసులో కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పాత్ర అనుమానాస్పదంగా ఉంది. ఆయన ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయనతో పాటు బెంగాల్ పోలీసులు కూడా ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.

 ఆర్జీ కర్ ఆసుపత్రిలో టీఎంసీ నాయకుల విధ్వంసం

వైద్యురాలి హత్యకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, మమతా ప్రభుత్వంపై కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో దాడులు జరిగాయి. దీంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. అధికార పార్టీ టీఎంసీకి చెందిన గూండాలు ఆధారాలను నాశనం చేసేందుకే ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి.  ఈ కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలకు మరింత బలం చేకూరింది.

మమతా బెనర్జీ, ఆమె పోలీసులపై తలెత్తుతున్న ప్రశ్నలు ఇవే

  • బాధితురాలి మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు ఎందుకు చూపించలేదు? ఎవరు ఆలస్యం చేయమని ఆదేశించారు?
  • వైద్యురాలి తల్లిదండ్రులను లోపలికి ఎందుకు అనుమతించలేదు? నేర స్థలంలో అలాంటిది ఏమి జరుగుతోంది?
  • వైద్యురాలి మృతదేహం లభ్యమైన ఆసుపత్రి విభాగంలో అకస్మాత్తుగా మరమ్మతు పనులు ఎందుకు ప్రారంభించారు, దీని వల్ల నేర స్థలం చెదిరిపోయే అవకాశం ఉందా?
  • కాలేజీ ప్రిన్సిపాల్‌పై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు?

 మమతా బెనర్జీకి లిట్మస్ టెస్ట్‌గా మారిన వైద్యురాలి హత్య కేసు

సీబీఐ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోంది. పశ్చిమ బెంగాల్, దేశం దీనిపై దృష్టి సారించాయి. ఈ కేసు పశ్చిమ బెంగాల్‌లో చట్టబద్ధ పాలనలో తీవ్ర లోపాలను బయటపెట్టింది. ఇది మమతా బెనర్జీకి లిట్మస్ పరీక్షగా మారింది. ఆమె ఇప్పటికే విఫలమయ్యారని చాలా మంది నమ్ముతున్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios