Kharif Crops MSP Hike: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచింది.  ఎంఎస్పీ పెంపుతో పాటు రైతు రుణాలపై వడ్డీ రాయితీని కూడా ప్రకటించింది.

Kharif Crops MSP Hike: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల‌ను (ఎంఎస్‌పీ) ప్రకటించింది. దీనిలో భాగంగా పలు ప్రధాన పంట‌ల‌కు మద్దతు ధర పెంచినట్టు అధికారికంగా ప్రకటించారు.

 ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (PIB) ద్వారా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ ఏడాది మద్దతు ధరల్లో కొన్ని పంటల‌కు గణనీయంగా పెరుగుదల ఉంది. ఖరీఫ్ పంటల MSPని ఖర్చు కంటే 50% ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు రైతులకు రుణాలపై వడ్డీ రాయితీ కూడా ఇవ్వనున్నారు.

పంటలు- కనీస మద్దతు ధరలు (MSP-(క్వింటాల్‌కు)

వరి (సాధారణ)- రూ.2369

వరి (గ్రేడ్ A)- రూ. 2389

జొన్న (హైబ్రిడ్)- రూ.3699

జొన్న (లోకల్)- రూ.3749

సజ్జ- రూ.2775

రాగులు- రూ.4886

మొక్కజొన్న- రూ.2400

కంది- రూ.8000

పెసర- రూ.8768

మినుములు- రూ.7800

నువ్వులు (మధ్యస్థం)- రూ.7710

నువ్వులు (పొడవు)- రూ.8110

పల్లీలు- రూ.7263

సన్ ఫ్లవర్- రూ.7721

సోయాబీన్- రూ.5328

నువ్వులు- రూ. 9846

నైజర్ సీడ్స్- రూ.9537

రుణాల వడ్డీపై రైతులకు రూ.15,642 కోట్ల రాయితీ

రైతు రుణాల వడ్డీపై రూ.15,642 కోట్ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్లుగా, ఈ రాయితీ కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా ఇచ్చే రుణాలపై వర్తిస్తుంది.  కేసీసీ ద్వారా రైతులకు రూ.2 లక్షల వరకు రుణం లభిస్తుంది. దీనిపై వడ్డీ సంవత్సరానికి 7 శాతం ఉంటుంది. ప్రభుత్వం 1.5% వడ్డీ రాయితీ ఇస్తుంది. సకాలంలో రుణం తీర్చిన రైతులకు సంవత్సరానికి 3% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

దేశంలో 7.75 కోట్లకు పైగా KCC ఖాతాలు

దేశంలో 7.75 కోట్లకు పైగా KCC ఖాతాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. వ్యవసాయానికి సంస్థాగత రుణ ప్రవాహాన్ని కొనసాగించడానికి ఈ మద్దతు కొనసాగించడం చాలా ముఖ్యం. ఇది ఉత్పాదకతను పెంచడానికి, చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి కీలకం. 2014లో KCC ద్వారా రూ.4.26 లక్షల కోట్ల రుణం ఇవ్వగా, డిసెంబర్ 2024 నాటికి అది రూ.10.05 లక్షల కోట్లకు పెరిగింది.