Asianet News TeluguAsianet News Telugu

Kerala rains: కేర‌ళ‌లో వ‌ర్ష బీభ‌త్సం.. 18 మంది మృతి, 8 జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్

Thiruvananthapuram:కేరళ కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొన‌సాగుతోది. వ‌ర్షాల కార‌ణంగా మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే ఐదు విమానాలు దారి మళ్లించబడ్డాయి. 
 

Kerala rains: Rain disaster in Kerala.. 18 dead, red alert for 8 districts
Author
Hyderabad, First Published Aug 4, 2022, 10:51 PM IST

 Heavy rains in Kerala: ద‌క్షిణాది రాష్ట్రమైన కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నారు. దీంతో అనేక ప్రాంతాలు నీట‌మునిగాయి. వ‌ర్ష బీభ‌త్సం కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 18 మంది చనిపోయారు. పలు ఆస్తులు దెబ్బతిన్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, తిరువనంతపురం మినహా ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. కేరళలో ప్రతికూల వాతావరణం కారణంగా పతనంతిట్ట జిల్లాలోని పంపా, మణిమాల, అచ్చన్‌కోవిల్‌తో సహా వివిధ నదుల నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కొట్టాయంలో మీనాచిల్ నది పొంగిపొర్లడంతో కొన్ని రహదారులు జలమయమయ్యాయి.

కొండచరియలు విరిగిపడడం, వరదలు రావడంతో అనేక కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించారు. రాష్ట్రంలోని ముంపు ప్రాంతాలు, విపత్తు సంభవించే ప్రాంతాల నుంచి 5,168 మందిని 178 సహాయ శిబిరాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. జూలై 31 నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు కేరళలో 198 ఆస్తులు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 30 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొంది. కాగా, రానున్న రోజుల్లో కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ పేర్కొంది. ఆగస్టు 4 నుంచి 8 వరకు కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ అంచనా వేసింది.

భారీ వర్షాల కారణంగా విమానాల దారి మళ్లింపు..

కేర‌ళ‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాలు విమాన స‌ర్వీసుల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ నుంచి కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సిన ఐదు విమానాలను కొచ్చి విమానాశ్రయానికి మళ్లించారు. షార్జా, అబుదాబి నుండి ఎయిర్ అరేబియా విమానాలు, బహ్రెయిన్ నుండి గల్ఫ్ ఎయిర్ విమానాలు, అబుదాబి నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు, దోహా నుండి ఖతార్ ఎయిర్‌వేస్ విమానాలను కొచ్చిన్‌కు మళ్లించినట్లు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (CIAL) తెలిపింది.

శబరిమల ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై నిషేధం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాలు శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌పైనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ది న్యూస్ మినిట్స్ నివేదిక ప్రకారం.. మలయాళ క్యాలెండర్ ప్రారంభ సమయంలో సాధారణంగా కొన్ని రోజుల పాటు తెరుచుకునే శబరిమల ఆలయం భక్తులను పరిమితం చేస్తోంది. పంపా నదిలో నీటిమట్టం పెరుగుతుండడంతో పాతనంతిట్టలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. అలాగే, పతనంతిట్టలోని మూజియార్-గవి స్ట్రెచ్‌లో కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు రవాణా పూర్తిగా నిలిచిపోయింది.

వాయిదాప‌డ్డ NTA CUET-UG

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా కేరళలో జరగాల్సిన సీయూఈటీ-యూజీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం వాయిదా వేసింది. పరీక్షకు సవరించిన తేదీలను త్వ‌రాలో ప్రకటిస్తామ‌ని తెలిపింది. గత కొన్ని రోజులుగా కేరళలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, అధిక సంఖ్యలో అభ్యర్థులు CUET (UG) 2022 పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయంలో చేరుకోవడం సాధ్యం కాదని NTA దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యమం చాలా కష్టంగా ఉంటుందని, విద్యుత్‌కు అంతరాయం కలుగుతుందని ఎన్‌టీఏ సీనియర్ డైరెక్టర్ సాధనా పరాశర్ అన్నారు. అందువల్ల, విద్యార్థి సంఘానికి మద్దతుగా, 2022 ఆగస్టు 4, 5, 6 తేదీల్లో కేరళ రాష్ట్రంలోని నగరాల్లో హాజరయ్యే అభ్యర్థుల కోసం CUET (UG) 2022ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios