Asianet News TeluguAsianet News Telugu

పోస్టు మార్టం నివేదిక: కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారణమిదీ

కేరళ రాష్ట్రంలోని  గర్భంతో ఉన్న ఏనుగు  మృతికి కారణాలను పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వెల్లడించింది.

Kerala Pregnant Elephant couldn't eat or drink for two weeks before her death, says post-mortem report
Author
New Delhi, First Published Jun 5, 2020, 11:30 AM IST

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని  గర్భంతో ఉన్న ఏనుగు  మృతికి కారణాలను పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వెల్లడించింది.

కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని వెల్లియార్ నదిలో ఓ ఏనుగు  ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఏనుగు మృతికి గల కారణాలపై పోస్టుమార్టం నివేదిక వెల్లడైంది.

రెండు వారాలుగా ఏనుగు కనీసం నీళ్లు కానీ ఆహారం తీసుకోలేదని పోస్టుమార్టం నివేదికలో తెలిపింది.ఏనుగు నోటిలో గాయాలు ఉన్నట్టుగా పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఏనుగు నోటిలో పేలుడు వల్లే ఈ గాయాలు అయినట్టుగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

also read:మానవత్వానికే మచ్చ: ఏనుగును చంపిన దుండగులను శిక్షించాలంటూ నెటిజన్ల ఫైర్

ఏనుగు ఊపిరితిత్తులు కూడ చెడిపోయినట్టుగా పోస్టుమార్టం నివేదిక ప్రకటించింది.  ఏనుగు దవడ విరిగిపోయింది. అంతేకాదు దవడకు తీవ్ర గాయాలైనట్టుగా కూడ ఈ నివేదిక తెలిపింది.  పేలుడు పదార్ధాలు నింపిన పండును ఏనుగు తిన్నదా... ఎవరైనా  ఉద్దేశ్యపూర్వకంగా ఏనుగుకు ఈ పండు తినిపించారా అనే విషయమై పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

నిందితులపై కఠిన చర్యలు తీసుకొంటామని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఈ ఘటనపై ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios