Pulitzer Prize winnerకు ఘోర అవమానం.. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
Pulitzer Prize winner Sana Irshad Mattoo: ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు విజేత, ఫోటో జర్నలిస్ట్ సనా ఇర్షిద్ మట్టు (Sana Irshad Mattoo) కు అవమానం జరిగింది. శనివారం ఆమె ఫ్రాన్స్ వెళ్లాల్సి ఉండగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. అయితే తనను ఏ కారణం చెప్పకుండా ఆపివేశారని ఆరోపించారు.
Pulitzer Prize winner Sana Irshad Mattoo: ప్రతిష్టాత్మక పులిట్జర్ ప్రైజ్ గ్రహీత కాశ్మీరీ ఫోటో జర్నలిస్ట్ సనా ఇర్షాద్ మట్టూ (Sana Irshad Mattoo) కు అవమానం జరిగింది.ఆమెకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఆమెను విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
జర్నలిస్టుపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు విధించిన ఆంక్షలే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. సనా ఇర్షాద్ మట్టూ ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి పారిస్కు వెళుతుండగా, ఆమెను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అయితే తనను ఏ కారణం చెప్పకుండా ఆపివేశారని పేర్కొన్నారు.
జరిగింది ఊహించనిది
ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఘటనపై సనా ఇర్షాద్ మట్టూ ట్వీట్ చేస్తూ.. ఈరోజు ఏం జరిగినా అది పూర్తిగా ఊహించనిది. సెరెండిపిటీ అర్లెస్ గ్రాంట్ 2020 అవార్డు గ్రహీతలలో 10 మందిలో ఒకరిగా నేను ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ మరియు పుస్తక ఆవిష్కరణకు వెళుతున్నాను. ఢిల్లీ నుంచి పారిస్కి నా ప్రయాణం ముందుగా నిర్ణయించబడింది. ఫ్రెంచ్ వీసా వచ్చినప్పటికీ, నన్ను ఢిల్లీ విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్లో ఆపారు. నాకు ఎటువంటి కారణం చెప్పలేదని, అయితే నేను అంతర్జాతీయంగా ప్రయాణించలేనని చెప్పానని ఆమె చెప్పింది. మట్టూను నో ఫ్లై లిస్ట్లో ఉంచినట్లు J&K పోలీసు అధికారులు ధృవీకరించారు. అంతకుముందు కొందరు కాశ్మీరీ జర్నలిస్టులు, కార్యకర్తలు. విద్యావేత్తలను విమానాశ్రయంలో అడ్డుకున్నారు.
వాస్తవానికి, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ముగిసిన తర్వాత, 370 తొలగించబడిన తర్వాత, కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన, కేంద్ర ప్రభుత్వం సామాజిక కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మొదలైన వారందరినీ చాలా కాలం పాటు గృహనిర్బంధంలో ఉంచాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటర్నెట్ తదితరాలు నిలిపివేయబడ్డాయి. ఈ క్రమంలో, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అన్ని వివిఐపిలు మరియు వివిధ రంగాలకు సంబంధించిన చురుకైన వ్యక్తుల విదేశీ ప్రయాణాన్ని కూడా నిషేధించారు.