కరుణానిధి మృతికి శోకసముద్రం: బోసిపోయిన చెన్నై రోడ్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. దీంతో.. రోడ్లన్నీ నిర్మానుశంగా మారిపోయాయి. రోడ్లపై ఒక్క వాహనం కూడా తిరిగినట్టు కనపడటం లేదు.
కరుణానిధి మృతితో తమిళనాడు శోకసంద్రమైంది. ఆయన మృతికి సంతాపంగా తమిళనాడు రాష్ట్రంలో నేడు పూర్తిగా సెలవు ప్రకటించారు. అదేవిధంగా వారం రోజులపాటు సంతాపదినాలు ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. దీంతో.. రోడ్లన్నీ నిర్మానుశంగా మారిపోయాయి. రోడ్లపై ఒక్క వాహనం కూడా తిరిగినట్టు కనపడటం లేదు.
ఇదిలా ఉండగా.. కరుణానిధి అంత్యక్రియలు చెన్నైలోని మెరీనా బీచ్ లోనే నిర్వహించాలని మద్రాసు హైకోర్టు ఈ రోజు ఉదయం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.