Asianet News TeluguAsianet News Telugu

హిజాబ్ నిర‌స‌న‌ల వెనుక పీఎఫ్ ఐ కుట్ర‌.. !

కర్ణాటకలో హిజాబ్ నిరసనలు కుట్ర ప్రకారమే జరిగాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీకోర్టుకు తెలిపింది. నిరసనల వెనక పీఎఫ్ఐ హస్తం ఉందని ఆరోపించింది.

Karnataka government order on Hijab row uniform religion neutral
Author
First Published Sep 21, 2022, 4:06 AM IST

కర్ణాటక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టులో మంగళవారం కూడా విచారణ జ‌రిగింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేసిన విద్యార్థి (పిటిషనర్) పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) ద్వారా ప్రభావితమయ్యారని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ముందు తన వాదనలు వినిపించారు.

పీఎఫ్‌ఐ కుట్రేనా?

హిజాబ్‌కు సంబంధించి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ సోషల్ మీడియాలో ఆందోళన ప్రారంభించిందని కర్ణాటక ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియా ధర్మాసనానికి తెలిపారు. హిజాబ్ ధరించడం ప్రారంభించమని సోషల్ మీడియాలో నిరంతరం సందేశాలు వచ్చాయి. ఇది సాధారణ సంఘటన కాదు కానీ పెద్ద కుట్రలో భాగమ‌ని తెలిపారు. 

మత-తటస్థ సంస్థలలో దుస్తులపై సర్క్యులర్

విద్యాసంస్థల్లో దుస్తులపై వచ్చిన సర్క్యులర్ మతానికి సంబంధించదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీన్ని అన్ని మతాల విద్యార్థులు అనుసరించాలి. విద్యార్థులందరూ నిర్ణీత దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేస్తూ కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులను సొలిసిటర్ జనరల్ సమర్పించారు.

అసలు వివాదం ఏంటి?

ఉడిపిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించరాని త‌ర‌గ‌తిలోకి ప్ర‌వేశాన్ని నిరాక‌రించారు. దీంతో కర్ణాటకలో హిజాబ్‌పై వివాదం మొదలైంది. దీనిపై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కాగా, ఫిబ్రవరి 8న మండ్యలోని పీఈఎస్ కాలేజీలోకి విద్యార్థులు ప్రవేశించి నినాదాలు చేశారు. ఆ తర్వాత వివాదం ముదిరింది.

19 ఏళ్ల ముస్కాన్ ఖాన్ అనే యువ‌తికి వ్య‌తిరేకంగా  జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ.. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌గా.. ఆ యువ‌తి  అల్లా హు అక్బర్ అంటూ నినాదాలు చేసింది. ఈ విష‌యం క్ర‌మంగా ముదిరింది. ఆ త‌రువాత‌ ఈ విషయం కర్ణాటక హైకోర్టుకు చేరుకుంది.  హిజాబ్ ఇస్లాం మతంలో అంతర్భాగం కాదని హైకోర్టు తీర్పునిచ్చింది, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం హిజాబ్‌ ధరించడం తప్పనిసరి ధార్మిక విధానం కాదని   హైకోర్టు స్పష్టంచేసింది. కాబట్టి పాఠశాలల లోపల యూనిఫాంలో దానిని ఒక భాగం చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేము. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios