బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు.. ఎప్పటి వరకంటే..?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పార్టీ పొడిగించింది. 2024 జూన్ వరకు ఆయన పదవిలో వుండనున్నారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పార్టీ పొడిగించింది. 2024 జూన్ వరకు ఆయన పదవిలో వుండనున్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించినట్లుగా తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ తదితర రాష్ట్రాల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.