Jammu Kashmir : జమ్మూ-కశ్మీర్‌లోని పూంచ్‌లో సైన్యానికి భారీ ఆయుధాల నిల్వలు దొరికాయి. పోలీసులు, సైన్యం కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

Jammu Kashmir : ఉగ్రవాద వ్యతిరేక భారీ ఆపరేషన్‌లో భాగంగా సైన్యం, జమ్మూ-కశ్మీర్ పోలీసులు పూంచ్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో డోడా-ఉధంపూర్ సరిహద్దులో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. పూంచ్ సెక్టార్‌లో అందిన నిఘా సమాచారం ఆధారంగా సైన్యం, పోలీసులు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సమయంలో భారీగా ఆయుధాలు దొరికాయి. ఇందులో ఒక ఏకే-సిరీస్ రైఫిల్, నాలుగు మ్యాగజైన్లు, 20 హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇంకా సోదాలు జరుగుతున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది... ఈ క్రమంలోనే ఉధంపూర్-దోడా సరిహద్దుల్లో భద్రతా బలగాలు ఉగ్రవాద కదలికలను గుర్తించారు. జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు... అయితే భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో బలగాలు కూడా కాల్పులు చేపట్టాయి. ఇందులో ఓ జవాన్ గాయపడినట్లు తెలుస్తోంది.

శుక్రవారం రాత్రి ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ మొదలైంది

డోడా-ఉధంపూర్ సరిహద్దులో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్ శుక్రవారం రాత్రి మొదలైంది. వైట్ నైట్ కార్ప్స్ 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ, "కిష్త్వార్ ప్రాంతంలో ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదుల కదలికలను గుర్తించాం. వెంటనే వైట్ నైట్ కార్ప్స్ అప్రమత్తమైన జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి సెప్టెంబర్ 19, 2025 ఉగ్రవాదులను చుట్టుముట్టాం '' అని తెలిపింది. ఉగ్రవాదులతో కాల్పులను ధృవీకరించిన సైన్యం, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పింది.

Scroll to load tweet…

జూన్ 26న ఇదే ప్రాంతంలో జైష్ టాప్ కమాండర్ హతం

గత ఏడాది కాలంలో ఈ ప్రాంతంలో చాలా ఎన్‌కౌంటర్లు జరిగాయి. జూన్ 26న డుడు-బసంత్‌గఢ్ అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది హైదర్, పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) టాప్ కమాండర్. అతను గత నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నాడు. ఏప్రిల్ 25న, బసంత్‌గఢ్ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు వీరమరణం పొందాడు.