Asianet News TeluguAsianet News Telugu

India-Pak మ్యాచ్ లో 'జై శ్రీరామ్‌' నినాదాలు.. డీఎంకే లీడ‌ర్ ఉద‌య‌నిధి స్టాలిన్ పై బీజేపీ ఫైర్

Chennai: ప్రపంచకప్ లో భాగంగా శనివారం భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా, పాకిస్థాన్  ఆట‌గాళ్ల‌ను ఉద్దేశించి క్రికెట్ అభిమానులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయ‌డాన్ని తమిళనాడు క్రీడా మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన ఒక వీడియోలో, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్తానీ వికెట్ కీపర్-బ్యాటర్ ముహమ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళుతుండగా క్రికెట్ అభిమానులు “జై శ్రీ రామ్” నినాదాలు చేశారు. అయితే, ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఫైర్ అయింది. 
 

Jai Shri Ram slogans raised during India-Pak match BJP hits out at DMK leader Udhayanidhi Stalin RMA
Author
First Published Oct 16, 2023, 12:33 PM IST

DMK leader Udhayanidhi Stalin-BJP: ప్రపంచకప్ లో భాగంగా శనివారం భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా, పాకిస్థాన్  ఆట‌గాళ్ల‌ను ఉద్దేశించి క్రికెట్ అభిమానులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయ‌డాన్ని తమిళనాడు క్రీడా మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన ఒక వీడియోలో, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్తానీ వికెట్ కీపర్-బ్యాటర్ ముహమ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళుతుండగా క్రికెట్ అభిమానులు “జై శ్రీ రామ్” నినాదాలు చేశారు. ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఫైర్ అయింది. అహ్మదాబాద్‌లో భారత్‌-పాక్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాక్‌ క్రికెటర్‌ను అవహేళన చేస్తూ 'జై శ్రీరామ్‌' నినాదాలు చేశారని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ విమర్శించారు. ఆట‌గాళ్ల ప‌ట్ల ఇలాంటి తీరు త‌గ‌ద‌ని పేర్కొన్నారు.

అయితే, స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నుండి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన‌ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. "ఈ ద్వేషపూరిత డెంగ్యూ, మలేరియా దోమ మళ్లీ విషాన్ని వ్యాపింపజేస్తుంది. మైదానంలో నమాజ్ కోసం మ్యాచ్ ఆగిపోయినప్పుడు మీకు ఇబ్బంది లేదు కానీ.." అంటూ ఎక్స్ పోస్టులో విమ‌ర్శించారు. రాముడు విశ్వంలోని ప్రతి మూలలో ఉన్నాడ‌నీ, అందుకే జై శ్రీరామ్ అని చెప్పండి అంటూ పేర్కొన్నారు. 

అలాగే, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాకేత్‌ గోఖలే కూడా పాక్‌ క్రికెటర్‌ను రెచ్చగొట్టేలా నినాదాలు చేయడాన్ని తప్పుబట్టారు. పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ డగౌట్‌కు వెళుతుండగా ప్రజలు నినాదాలు చేస్తున్న వీడియోలు తీవ్ర ప్రతిస్పందనలకు దారితీశాయి. ఈ నినాదాలు క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమనీ, క్రికెటర్‌ను వేధించడమేనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేస్తున్నాడనీ, అంతకుముందు మ్యాచ్‌లో యుద్ధం-దెబ్బతిన్న గాజాలో ప్రజలకు సంఘీభావం తెలుపుతూ, మతాన్ని మైదానంలోకి తీసుకువ‌చ్చాడ‌ని పేర్కొంటూ ప‌లువురు  విమ‌ర్శించారు.

అయితే, స్టాలిన్.. "భారతదేశం క్రీడాస్ఫూర్తి-ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. అయితే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్తాన్ ఆటగాళ్ల ప‌ట్ల ఇలా చేయ‌డం ఆమోదయోగ్యం కాదు. క్రీడలు దేశాల మధ్య ఏకం చేసే శక్తిగా ఉండాలి, నిజమైన సోదరభావాన్ని పెంపొందించాలి. దానిని సాధనంగా ఉపయోగించాలి ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ఖండించదగినది' అని ఆయన పోస్ట్ చేశారు. అంతకుముందు, స్టాలిన్ సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలతో దుమారం రేపారు.

Follow Us:
Download App:
  • android
  • ios