Char Dham Yatra 2023: చార్ ధామ్ యాత్ర 2023 ప్రారంభ‌మైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. చార్ ధామ్ యాత్ర శుక్రవారం లాంఛనంగా ప్రారంభం అయింది. గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాల ద్వారాలు తెరవడంతో శనివారం యాత్ర లాంఛనంగా ప్రారంభమైందనీ,  ఏప్రిల్ 25న బాబా కేదార్ నాథ్ తలుపులు కూడా భక్తుల కోసం తెరుచుకోనున్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.  

Char Dham Yatra-2023 Begins: చార్ ధామ్ యాత్ర 2023 ప్రారంభ‌మైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. చార్ ధామ్ యాత్ర శుక్రవారం లాంఛనంగా ప్రారంభం అయింది. గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాల ద్వారాలు తెరవడంతో శనివారం యాత్ర లాంఛనంగా ప్రారంభమైందనీ, ఏప్రిల్ 25న బాబా కేదార్ నాథ్ తలుపులు కూడా భక్తుల కోసం తెరుచుకోనున్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివ‌రాల్లోకెళ్తే.. అక్షయ తృతీయ సందర్భంగా శనివారం వేసవి కాలానికి గంగోత్రి-యమునోత్రి ఆలయ ద్వారాలను భక్తుల కోసం తెరిచారు. గంగోత్రి ద్వారాలు మధ్యాహ్నం 12.35 గంటలకు, యమునోత్రి ద్వారాలు మధ్యాహ్నం 12.41 గంటలకు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ధామ్ కు చేరుకుని గంగాపూజ చేశారు. పూజల అనంతరం సీఎం సమక్షంలో గంగోత్రి ధామ్ తలుపులు తెరిచారు. ఆ తర్వాత యమునోత్రి ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. భక్తులకు సీఎం ధామి పూలవర్షంతో స్వాగతం పలికారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

గంగోత్రి తలుపులు తెరిచే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా శుక్రవారం ముఖ్బా నుంచి మా గంగా కీ డోలీ ఆర్మీ బ్యాండ్ బాణీలతో గంగోత్రి ధామ్ కు బయలుదేరారు. చార్ ధామ్ యాత్ర శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కాగా, శనివారం మధ్యాహ్నం గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాల ద్వారాలు తెరవడంతో యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. అంతకుముందు శుక్రవారం డోలీలో గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ముఖ్బా గ్రామం నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు ఆర్మీ బ్యాండ్, ధోల్ దామోన్, రణసింగేతో గంగోత్రి ధామ్ కు డోలీని పంపించారు.

ముఖ్బా గ్రామంలోని మహిళలు గంగామాత డోలీకి పూలవర్షం కురిపించి వీడ్కోలు పలికారు. అనంతరం గంగామాత డోలీతో ముఖ్బా నుంచి జంగ్లా వరకు 7 కిలోమీటర్లు నడిచి పూజారి, భక్తులు గంగోత్రి హైవేకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో కాలినడకన భైరాన్ వ్యాలీకి చేరుకున్నారు. గంగామాత డోలీ ఇక్కడి భైరాన్ ఆలయంలో రాత్రి విశ్రాంతి తీసుకుంది. 

Scroll to load tweet…
Scroll to load tweet…

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని గంగోత్రి ధామ్, యమునోత్రి ధామ్ తలుపులు తెరుచుకున్న సందర్భంగా గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (ఆర్మీ) భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భక్తులందరూ సజావుగా, ఆహ్లాదకరంగా, పవిత్రంగా చార్ ధామ్ యాత్రలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.