పాకిస్థాన్ అమ్మాయి.. ఇండియా అబ్బాయి ఒకటయ్యారు. సోషల్ మీడియా వేదికగా స్నేహితులైన వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఒక్కరినొకరు కావాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి.. సరిహద్దులు దాటి.. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.
ప్రేమకు కులాలు, మతాలు అడ్డుకావు.. పేదధనిక అంతరం ఉండదు. అసలు వారి ఎలాంటి ఎల్లలు ఉండవు. ఒక్కసారి మనస్సుకు నచ్చితే.. చాలు ఈ భూమ్మీద ఎక్కడ ఉన్న సరే .. కలిసి ఒక్కటి కావాల్సిందే.. ఇదే తరహాలో వేర్వేరు దేశాలకు చెందిన వారు ప్రేమించుకుని.. వివాహ బంధంతో ఒక్కటైన సందర్భాలేనో.. తాజాగా దాయాది దేశాలకు చెందిన యువతియువకుల మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమకు దేశాల మధ్య గొడవలు అడ్డంకిగా మారలేదు, సరిహద్దులు ఆటంకం మారలేవు. మహారాష్ట్రకు చెందిన ఓ అబ్బాయి.. పాకిస్థాన్లోని అమ్మాయి సోషల్ మీడియా వేదికగా ప్రేమించి.. పెద్దలు అంగీకరించడంతో సరిహద్దులు దాటి.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
మహారాష్ట్రలోని ముంబాయికి చెందిన మహేందర్ కుమార్ పాకిస్తాన్ లోని సుక్కూర్ చెందిన అమ్మాయితో ఫేస్బుక్లో పరిచయం అయింది. ఇద్దరు తరుచు మాట్లాడుకోవడం తర్వాత ఆమెది పాకిస్థాన్ తెలిసింది. అయినా సరే వారిద్దరూ ఏ మాత్రం తగ్గలేదు. వారి ప్రేమను చంపుకోలేదు. ముంబాయి అబ్బాయి ధైర్యం చేసి ప్రపోజ్ చేయగానే.. పాకిస్తాని అమ్మాయి ఒప్పుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తమ పెద్దలతో చెప్పి ఒప్పించారు.
అనంతరం కుటుంబీకులు వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిపి వివాహ వేడుకను ఖరారు చేశారు. ఈ క్రమంలో ముంబయికి చెందిన మహేందర్ కుమార్.. పాకిస్తాని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబంతో సహా భారత దేశ సరిహద్దు దాటి పాకిస్థాన్నుకు వెళ్లాడు. సుక్కూర్లోని ఓ స్థానిక హాలులో వీరి వివాహం జరిగింది, దీనికి జంట బంధువులు , హిందూ సమాజానికి చెందిన వ్యక్తులు హాజరయ్యారు. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత పాకిస్తాని అమ్మియి తన భర్తతో కలిసి మరికొద్ది రోజుల్లో భారతదేశానికి రానున్నది. వివాహ కార్యక్రమానికి హాజరైన ముఖి హిందూ పంజాత్ సుక్కుర్కు చెందిన ఐశ్వర్ లాల్ మకేజా మాట్లాడుతూ.. ప్రేమకు సరిహద్దులు లేవని, ఈ జంట సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.