అగ్ని-5 క్షిపణి ప్రయోగం సక్సెస్
అగ్ని-5 క్షిపణి సక్సెస్
భువనేశ్వర్: అగ్ని-5 ఖండాంతర క్షిపణిని భారత్
విజయవంతంగా ఆదివారం నాడు పరీక్షించింది.
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-5 ఖండాంతర
క్షిపణిని తయారు చేసింది. ఒడిశాలోని అబ్దుల్ కలామ్
ద్వీపం నుంచి దీన్ని ప్రయోగించారు.
అణ్వాస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి
ఉపరితలం నుంచి ఉపరితలంపై 5 వేల కిలోమీటర్ల
దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఆదివారం ఉదయం 9.48 నిమిషాలకు ఇంటిగ్రేటెడ్ టెస్టు
రేంజ్లోని నాలుగో లాంచ్ ప్యాడ్ నుంచి ఈ క్షిపణిని మొబైల్
లాంచర్ సాయంతో పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.