Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కొత్త కేసులు.. ఎన్ని న‌మోదయ్యాయంటే?

Coronavirus: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. అయితే, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా న‌మోదైన కేసుల్లో స్వ‌ల్ప త‌గ్గుద‌ల న‌మోదైంది. మ‌ర‌ణాలు మాత్రం పెరిగాయి. ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కొత్త కేసులు ఆందోళ‌న‌క‌రంగా న‌మోద‌వుతున్నాయి. 
 

India Reports 2.86 Lakh New Cases; Positivity Rate At 19.5%
Author
Hyderabad, First Published Jan 28, 2022, 9:51 AM IST

Coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా (Coronavirus) మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. కోవిడ్‌-19 థ‌ర్డ్ వేవ్ అంచ‌నాలు తీవ్ర భయాందోళ‌న క‌లిగిస్తున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి (Coronavirus)  సాధార‌ణ కేసుల‌తో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి.  ఇప్పటికే కరోనా కేసులు మొత్తం దేశంలో నాలుగు కోట్ల మార్కును అందుకున్నాయి. రోజువారీ (Coronavirus) మరణాలు సైతం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే, ఫిబ్ర‌వ‌రిలోనే క‌రోనా వైర‌స్ థ‌ర్డ్ వేవ్ ఒమిక్రాన్ వేరియంట్ పీక్ స్టేజ్ ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అదే నెల 15 నాటికి ఒమిక్రాన్ పీక్ స్టేజ్ దాటుతుంద‌ని చెబుతున్నారు. గ‌త 24 గంట‌ల్లో దేశంలో స్వ‌ల్పంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. 

దేశంలో గత కొన్ని రోజులుగా నిత్యం రెండు లక్షలకు పైగానే (Coronavirus)  పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే, కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల్లో స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల న‌మోదైంది.  గురువారం 2.8 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కొత్తగా 2.51 లక్షలకు (Coronavirus) తగ్గాయి. దీంతో పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 2,51,209 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్‌-19 కేసులు 4,06,22,709కి చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,80,24,771 మంది బాధితులు కరోనా వైరస్(Coronavirus) నుంచి కోలుకున్నారు.  గ‌త 24 గంట‌ల్లోనే 3 ల‌క్ష‌ల మందికి పైగా కోలుకోవ‌డం ఊర‌ట క‌లిగించే విష‌యం. కొత్త‌గా  3,47,443 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు అధికం అవుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం  21,05,611 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.

క‌రోనా (Coronavirus) మ‌ర‌ణాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ (Coronavirus) తో పోరాడుతూ కొత్తగా 627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో ఇప్పటివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య  4,92,327కు పెరిగింది. కరోనా కేసులు తక్కువవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 15.28 శాతానికి తగ్గింది. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌తో పాటు క‌రోనా ప‌రీక్ష‌ల‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు 1,64,44,73,216 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. అంద‌లో మొద‌టి డోసు తీసుకున్న‌వారు 89.1 కోట్ల మంది ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారు 69.9 కోట్ల మంది ఉన్నారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 72,21,66,248 క‌రోనా (Coronavirus) ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. గురువారం ఒక్క‌రోజే 14,62,261 క‌రోనా (Coronavirus) మ‌హ‌మ్మారి శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios