Kolkata: అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి జీ-20 దేశాల సమిష్టి కృషి గణనీయంగా తోడ్పడుతుందనీ, అంతర్జాతీయ సహకారం పెంపొందించడం-అవినీతికి మూలకారణాలను పరిష్కరించే పటిష్టమైన చర్యలను అమలు చేయడం ద్వారా భారీ  మార్పుల‌ను సాధించవచ్చని ప్రధాని న‌రేంద్ర మోడీ నొక్కి చెప్పారు.

Prime Minister Narendra Modi: అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ అనే కఠినమైన విధానం భారత్ లో ఉందని జీ-20 సమావేశం (G-20 anti-corruption Ministerial meeting)లో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలనను పెంపొందించడంలో భారత్ కు ఉన్న బలమైన నిబద్ధతను వర్చువల్ ప్రసంగంలో పునరుద్ఘాటించారు. పారదర్శకమైన-జవాబుదారీ పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి భారతదేశం సాంకేతికత-ఇ-గవర్నెన్స్ ను ఉపయోగించుకుంటోందని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. తన ప్రారంభోపన్యాసంలో, కవి, నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేర‌ణాత్మ‌క సందేశాన్ని ప్ర‌స్తావించారు. అవినీతి వల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలపై దాని అసమాన ప్రభావాన్ని ఎత్తిచూపిన ప్రధాని మోడీ.. వనరుల కేటాయింపు, మార్కెట్ సమతౌల్యం, కీలకమైన ప్రజాసేవల క్షీణతపైదృష్టి సారించిన‌ట్టు తెలిపారు.

భారతదేశ దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించిన మోడీ, బాధ్యతాయుతమైన-పారదర్శకమైన పరిపాలనా చట్రాన్ని స్థాపించడానికి దేశం సాంకేతిక పరిజ్ఞానం-ఇ-గవర్నెన్స్ ను ఉపయోగించాలని నొక్కి చెప్పారు. ఈ సమగ్ర విధానం ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలలో అసమర్థత-లీకేజీలను నిరోధించింద‌నీ, ఫలితంగా మిలియన్ల మంది పౌరులకు 360 బిలియన్ డాలర్లకు పైగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు జరిగాయ‌ని అన్నారు. ప్రభుత్వ సేవలను ఆటోమేట్ చేయడంలో విజయవంతమైన ఉదాహరణలను ఉటంకిస్తూ, వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో భారతదేశం పురోగతిని వివ‌రించారు. ఆర్థిక నేరస్థులు, పారిపోయిన వారి నుంచి గణనీయమైన ఆస్తుల రికవరీకి వీలు కల్పించినందుకు ఆర్థిక నేరస్థుల చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం సమర్థతను కొనియాడారు.

2014లో జీ-20 శిఖరాగ్ర సదస్సులో విదేశాల‌కు పారిపోయిన‌ ఆర్థిక నేరగాళ్లపై తాను చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోడీ గుర్తు చేస్తూ.. ఆర్థిక నేరగాళ్లను ఎదుర్కొనేందుకు, ఆస్తుల రికవరీ ప్రయత్నాలకు ఊతమిచ్చేందుకు 2018లో సమగ్ర తొమ్మిది సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. సీమాంతర నేరస్థులు ఉపయోగించుకునే చట్టపరమైన లొసుగులను తొలగించడానికి చట్ట అమలులో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని ప్రధాని మోడీ కోరారు. జీ-20 దేశాల సమిష్టి ప్రయత్నాలు అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి గణనీయంగా మద్దతు ఇవ్వగలవనీ, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం, అవినీతి మూల కారణాలను పరిష్కరించే బలమైన చర్యలను అమలు చేయడం ద్వారా భారీ తేడాను సాధించవచ్చని ప్రధాని నొక్కి చెప్పారు. అవినీతిపై పోరాటంలో ఆడిట్ సంస్థల పాత్రను ఆయన ఎత్తిచూపారు. మన పరిపాలన, న్యాయ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు విలువల వ్యవస్థల్లో నైతికత, సమగ్రత సంస్కృతిని పెంపొందించాలని ప్రధాని మోడీ కోరారు. అలా చేయడం ద్వారానే న్యాయమైన, సుస్థిర సమాజానికి పునాది వేయగలమ‌ని అన్నారు.