స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులతో బందోబస్తు !
Independence Day celebrations: భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎర్రకోట వద్దకు సుమారు 7,000 మంది ఆహ్వానితులు వస్తారని, సోమవారం స్మారక చిహ్నం చుట్టూ 10,000 మంది పోలీసులను మోహరించనున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Azadi ka Amrit Mahotsav: దేశవ్యాప్తంగా స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశరాజధాని ఢిల్లీలో 75వ స్వాంతంత్య్ర వార్షికోత్సవ వేడుకల కోసం ఎర్రకోట త్రివర్ణ రంగులతో ముస్తాబైంది. ఇప్పటికే రిహార్సల్ కూడా పూర్తయినట్టు సమాచారం. భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎర్రకోట వద్దకు సుమారు 7,000 మంది ఆహ్వానితులు వస్తారని, సోమవారం స్మారక చిహ్నం చుట్టూ 10,000 మంది పోలీసులను మోహరించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద బహుళ లేయర్డ్ సెక్యూరిటీ కవర్ను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట వద్దకు సుమారు 7,000 మంది ఆహ్వానితులు వస్తారని, సోమవారం స్మారక చిహ్నం చుట్టూ 10,000 మంది పోలీసులను మోహరించినట్టు తెలిపారు. అలాగే, ఆ ప్రదేశంలోని ఆకాశమార్గంపైనా నిఘా ఉంచినట్టు తెలిపారు. ఎర్రకోట చుట్టూ ఐదు కిలోమీటర్ల ప్రాంతం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వరకు "నో కైట్ ఫ్లయింగ్ జోన్"గా గుర్తించబడింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇతర భద్రతా సంస్థల నుండి యాంటీ-డ్రోన్ సిస్టమ్లను కూడా ఇన్స్టాల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
"మేము ఎర్రకోట, దాని చుట్టుపక్కల హై రిజల్యూషన్ సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేసాము. వాటి ఫుటేజీని 24 గంటల్లో పర్యవేక్షిస్తున్నాము. ఈసారి జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానితుల సంఖ్య 7,000 కి పెరిగింది. మొఘల్ ప్రవేశ ద్వారం వద్ద కూడా FRS కెమెరాలు అమర్చబడ్డాయి" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. లంచ్ బాక్స్లు, వాటర్ బాటిళ్లు, రిమోట్ కంట్రోల్డ్ కార్ కీలు, సిగరెట్ లైటర్లు, బ్రీఫ్కేస్లు, హ్యాండ్బ్యాగ్లు, కెమెరాలు, బైనాక్యులర్లు, గొడుగులు, ఇలాంటి వస్తువులను ఎర్రకోట ప్రాంగణంలోకి అనుమతించబోమని తెలిపారు. ఢిల్లీలో ఇప్పటికే 144 సెక్షన్ను ఏర్పాటు చేశామని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) దేవేంద్ర పాఠక్ తెలిపారు. ఆగస్టు 13 నుండి ఆగస్టు 15 వరకు ఎర్రకోటలో కార్యక్రమం ముగిసే వరకు ఎవరైనా గాలిపటాలు, బెలూన్లు లేదా చైనీస్ లాంతర్లను ఎగురవేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాంటి చర్యలపై ఆంక్షలు విధించినట్టు తెలిపారు.
"వ్యూహాత్మక ప్రదేశాలలో గాలిపటాలు పట్టేవారు అవసరమైన పరికరాలతో మోహరించారు. వారు ఎలాంటి గాలిపటం, బెలూన్ లేదా చైనీస్ లాంతర్లను ఫంక్షన్ ప్రాంతానికి చేరుకోకుండా నిరోధిస్తారు. అలాగే, ఆకాశమార్గం ద్వారా.. ఇతర మార్గల ద్వారా వచ్చే ప్రమాదాలను గుర్తించే వీలుగా రెడ్ ఫోర్ట్ వద్ద రాడార్లను మోహరిస్తారు. అలాగే, మానవరహిత విమానాలు కూడా రంగంలోకి దిగనున్నట్లు" ఓ అధికారి వెల్లడించారు. శుక్రవారం, ఢిల్లీ పోలీసులు ఆనంద్ విహార్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ సమీపంలో 2,200 లైవ్ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల కోసం కూడా పోలీసులు భారీ తనిఖీలు చేస్తున్నారు. సిబ్బందికి తగిన భద్రత, శిక్షణ, ప్రణాళికల ప్రకారం విస్తరణ గురించి వివరిస్తున్నట్లు తెలిపారు.
వైమానిక వస్తువులను కలిగి ఉండేలా ఉత్తర, మధ్య, న్యూఢిల్లీ జిల్లా యూనిట్లలో దాదాపు 1,000 హై-స్పెసిఫికేషన్ కెమెరాలు అమర్చబడతాయి. ఈ కెమెరాలు స్మారక చిహ్నం వద్దకు VVIP మార్గాన్ని పర్యవేక్షించడంలో సహాయపడతాయని వారు తెలిపారు. ఢిల్లీ పోలీసులు కూడా పెట్రోలింగ్, విధ్వంసక తనిఖీలను ముమ్మరం చేశారు. హోటళ్లు, గెస్ట్ హౌస్లు, పార్కింగ్ స్థలాలు, రెస్టారెంట్లు తనిఖీలు చేస్తున్నామని, అద్దెదారులు, సేవకుల వెరిఫికేషన్ను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. పారాగ్లైడర్లు, హ్యాంగ్ గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు వంటి వైమానిక వస్తువులను ఎగురవేయడాన్ని నిషేధిస్తూ జూలై 22న పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారని, ఇది ఆగస్టు 16 వరకు అమలులో ఉంటుందని వారు తెలిపారు.