Asianet News TeluguAsianet News Telugu

బేకరి యజమానికి కరోనా: షాపుకు వచ్చిన 500 మంది శాంపిల్స్ సేకరణ

బేకరి యజమానికి కరోనా సోకింది. అతనితో సన్నిహితంగా మెలిగిన వారి జాబితాను అధికారులు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే 500 మంది జాబితాను అధికారులు రడీ చేశారు. వీరి శాంపిల్స్ ను తీసి పరీక్షలకు పంపుతున్నారు. ఈ ఘనట కేరళ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
 

In Keralas Idukki asymptomatic bakery-owner tests positive his primary contacts could go up to 500
Author
Kerala, First Published May 17, 2020, 11:07 AM IST

తిరువనంతపురం:బేకరి యజమానికి కరోనా సోకింది. అతనితో సన్నిహితంగా మెలిగిన వారి జాబితాను అధికారులు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే 500 మంది జాబితాను అధికారులు రడీ చేశారు. వీరి శాంపిల్స్ ను తీసి పరీక్షలకు పంపుతున్నారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని వందెన్మెడ్ పంచాయితీ పరిధిలో బేకరీ షాపు యజమానికి కరోనా సోకింది. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన ఈ విషయాన్ని వైద్యాధికారులు ధృవీకరించారు. ఈ విషయాన్ని గుర్తించి తర్వాత అతడిని తోడుపుఝ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బేకరి యజమాని కుటుంబాన్ని కూడ క్వారంటైన్ కు తరలించారు.

also read:విద్యార్థులకు గుడ్‌న్యూస్: టెన్త్ పరీక్షలు రద్దు, కానీ...

ఈ బేకరికి ఎవరెవరు వచ్చారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. బేకరి షాపుకు ఎవరెవరు వచ్చారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 500 మంది అధికారుల జాబితాను సిద్దం చేశారు. ఈ షాపులో ఐదు నిమిషాల కంటె ఎక్కువ సేపు ఎవరెవరు గడిపారనే విషయమై ఆరా తీస్తున్నారు.  వీరిందరి నుండి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపుతున్నారు.

స్థానిక గ్రామ పంచాయితీకి చెందిన వారే ఎక్కువగా ఈ బేకరి షాపుకు వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించిన వారిలో ఎవరికి కూడ కరోనా నిర్ధారణ కాలేదని తేలింది. ఇంకా మిగిలిన వారి శాంపిల్స్ ఫలితాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios