లక్నోలో ఇల్లు కూలి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..
శుక్రవారం లక్నోలో పాత ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ : శుక్రవారం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ పాత ఇల్లు కుప్పకూలడంతో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.
అలంబాగ్లోని రైల్వే కాలనీలో దశాబ్దాల క్రితం నిర్మించిన ఓ ఇల్లు కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను సతీష్ చంద్ర (40), సరోజినీ దేవి (35), ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. దీనికి సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.