Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తోందని.. భార్యపై వేడి సాంబార్ పోసిన భర్త..

ఓ భార్య పట్ల భర్త క్రూరంగా ప్రవర్తించాడు. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తోందని ఆమెపై వేడి వేడి సాంబార్ పోశాడు. దీంతో ఆమెకు తీవ్రగాాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Horrible.. Husband pours hot sambar on wife for questioning extramarital affair..ISR
Author
First Published May 28, 2023, 8:39 AM IST

ఆ దంపతులకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు. అనోన్యంగా సాగిపోతున్న కాపురం. చక్కగా సాగుతున్న కాపురంలో వివాహేతర సంబంధం చిక్కుపెట్టింది. భర్త వేరే మహిళతో చనువుగా ఉంటున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్త తీరును భార్య ప్రశ్నించింది. కోపోద్రిక్తుడు అయిన భర్త.. ఆమెపై వేడి సాంబార్ పోశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

చావులో సైతం వీడని స్నేహం.. స్నేహితుడి చనిపోయాడని, చితిలో దూకిన వ్యక్తి..

వివరాలు ఇలా ఉన్నాయి. విల్లుపురం జిల్లాలోని కొండూరు గ్రామానికి చెందిన 40 ఏళ్ల ఆరోగ్య స్వామి, 30 ఏళ్ల పెరియనాయకికి కొన్ని సంవత్సరాల కిందట పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆరోగ్యస్వామి జేసీబీ ఆపరేటర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మరో మహిళ పరిచయం అయ్యింది. ఆమెతో అక్రమ సంబంధం ఏర్పడింది.

హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు భార్య ఉద్యోగం తొలగించిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం..

అప్పటి నుంచి ఆరోగ్య స్వామి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ విషయాన్ని భార్య గమనించింది. కొంత కాలం తరువాత ఆమెకు అసలు విషయం తెలిసింది. దీంతో భర్తను నిలదీసింది. అయినా భర్త తీరు మార్చుకోలేదు. వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గత శుక్రవారం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో పెరియనాయకి వంట చేస్తోంది.

హిందూ యువకుడితో ముస్లిం యువతి డిన్నర్ కు వెళ్లిందని మూక దాడి.. రక్షించేందుకు వచ్చిన ఇద్దరిని పొడిచిన దుండగులు

గొడవ తీవ్రవాగ్వాదంగా మారింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆరోగ్య స్వామి తన భార్యపై వేడి వేడి సాంబార్ పోశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. నొప్పిని భరించలేక గట్టిగా అరవడంతో చుట్టుపక్కల నివసించేవారు పరిగెత్తుకొచ్చారు. ఆమె పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే అంబులెన్స్ లో ముండియంబాక్కం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై తిరువెన్నెనల్లూర్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios