యువతిని కొట్టి చంపిన కన్నతండ్రి.. కరెంట్ షాక్ తో చనిపోయిందని నాటకం.. చివరికి...
కూతురు ప్రేమను జీర్ణించుకోలేని తండ్రి ఆమెను దారుణంగా కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. అక్కడి ప్రయాగ్ రాజ్ జిల్లాలో పరువు హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నతండ్రి కుమార్తె పాలిట కాలయముడిగా మారాడు. కుమార్తెను చంపిన తర్వాత కరెంట్ షాక్ తో చనిపోయిందని నమ్మించడానికి ప్రయత్నించాడు. అలా చెప్పి అంత్యక్రియలు కూడా పూర్తి చేశాడు. విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లల్లన్ అనే వ్యక్తి కర్చన దగ్గరలో ఉన్న హిందూ బేలా గ్రామంలో ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కూతుర్లు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం పెద్ద కుమార్తె చాందిని.. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.
అంతటా గాలించిన కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే ఉంది. 20 రోజుల క్రితం చెల్లి ఆసియాతో కలిసి చాందిని మళ్లీ పారిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇక చేసేదేం లేక ఈసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసును దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అక్క చెల్లెలు ఇద్దరు ముంబైలో ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి పోలీసుల సహకారంతో వారిని ఇంటికి తీసుకు వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత యువతులను తండ్రి తీవ్రంగా మందలించడంతో.. తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్టుగా తెలిపింది.
కూతురిని కాల్చిచంపిన తండ్రి.. ఆపై.. అసలు కారణమదేనా..?
కూతురు చెప్పిన విషయం విని తండ్రి లల్లన్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో యువతిని గదిలో బంధించాడు. ఆ తరువాత విచక్షణారహితంగాచితకబాదాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు చాందిని తట్టుకోలేకపోయింది. ప్రాణాలు విడిచింది. అది చూసింది లల్లన్.. చిన్న కుమార్తె ఆసియాను ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. అంతేకాదు, కరెంట్ షాక్ తో చాందిని చనిపోయిందని నాటకం ఆడాడు. గ్రామస్తులను నమ్మించాడు. చాందిని మృతదేహాన్ని స్మశానంలో పూడ్చి పెట్టాడు. అయితే కళ్ళముందే సోదరి చనిపోవడాన్ని జీర్ణించుకోలేని ఆసియా.. తండ్రి చేసిన ఘోరమైన విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.