Asianet News TeluguAsianet News Telugu

కూతురిని కాల్చిచంపిన తండ్రి.. ఆపై.. అసలు కారణమదేనా..?  

ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఓ ఉపాధ్యాయ తండ్రి తన టీచర్ కుమార్తెను కాల్చిచంపాడు. ఆ తర్వాత తనను కూడా కాల్చుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో కుమార్తెను చంపి ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. 

Primary School Teacher Kills Daughter Before Shooting Self In UP
Author
First Published Mar 26, 2023, 11:53 PM IST

ప్రేమ ఓ ఇద్దరి చావుకు కారణమైంది. ఆ కుటుంబాన్ని విచ్చిన్నం చేసింది. ఓ ఉపాధ్యాయ తండ్రి తన అల్లరు ముద్దుగా పెంచుకున్న టీచర్ కుమార్తెను చంపుకునేలా చేసింది.  ఆ తరువాత తాను కూడా తనువు చాలించేలా చేసింది. ఈ మొత్తం పరిణామానికి కారణం .. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అని కుమార్తె పట్టుబడటమే. కూతురు, భర్త మృతి చెందడంతో భార్య, కొడుకు రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 

వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలోని హౌసింగ్ డెవలప్‌మెంట్ కాలనీ నివాసి నరేంద్ర సింగ్ యాదవ్ (55). ఆయన స్థానిక ఇంటర్ కాలేజీలో అధ్యాపకుడిగా  విధులు నిర్వహిస్తున్నారు. అతడు తన కూతురు, కుమారుడు, భార్య శశిప్రభతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుమార్తె జుహీ (26) సోరోంజీ బ్లాక్‌లోని మీర్జాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

ప్రేమ పెళ్లి విషయంలో వివాదం 

కూతురు ఓ అబ్బాయిని ప్రేమిస్తోందని నరేంద్ర సింగ్ యాదవ్ కి శశిప్రభ చెప్పింది. అతడిని పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఉందనీ, మాట వినడం లేదని తెలిపింది. ఈ విషయంలో నరేంద్ర కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత కూతురు మా మాట వినడానికి సిద్ధంగా లేదు. అదే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. శనివారం కూడా పెళ్లి విషయంలో కూతురు, తండ్రి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం క్రమంగా  పెరిగింది. ఇంతలో తండ్రికి కోపం రావడంతో తన గదిలోకి వెళ్లి రైఫిల్ తీసుకొచ్చాడు. కుమార్తెపై రైఫిల్ గురిపెట్టి కాల్పులు జరిపాడు. బుల్లెట్ కూతురి ఛాతీలోకి దూసుకెళ్లడంతో ఆమె అక్కడే పడిపోయింది. దీని తర్వాత అతను తనని తాను కాల్చుకున్నాడు. కాల్పుల శబ్దం విని చుట్టుపక్కల ప్రజలు గుమిగూడారు. దీంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ విచారణ జరిపిన అనంతరం డాక్టర్‌ మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. 

పోలీసుల దర్యాప్తు 

హౌసింగ్ డెవలప్‌మెంట్‌లో ఉపాధ్యాయుడే కూతురిని, ఆమెను కాల్చిచంపినట్లు సమాచారం అందిందని ఎస్పీ సౌరభ్ దీక్షిత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం అందుకున్నారు. ప్రేమ వ్యవహారమే అతడిని హర్ట్ చేసిందని ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఆధారాలు సేకరించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios