Siddaramaiah : ఇటీవల ఒకే దేశం.. ఒకే భాష అన్న పద్దతిలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరోసారి హిందీ భాష అంశం తెరమీదకు వచ్చింది. నటులు కిచ్చా సుదీప్-అజయ్ దేవగన్ల ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
Sudeep-Ajay Devgn-Siddaramaiah : మరోసారి హిందీ భాష అంశం తెరమీదకు వచ్చింది. కన్నడ నటుడు కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ మధ్య భాషా వివాదం ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ వివాదంలోకి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా ఎంట్రీ ఇచ్చారు. అజయ్ దేవగన్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ దానిపై స్పందించారు. హిందీ ఎప్పుడూ మన జాతీయ భాష కాదు మరియు ఎప్పటికీ అలా ఉండదని పేర్కొన్నారు. మన దేశంలోని భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రతి భాషకు దాని స్వంత గొప్ప చరిత్ర ఉందనీ, దానిని ప్రజలు గర్విస్తారని తెలిపారు. అలాగే, తాను కన్నడుడిని అయినందుకు గర్వపడుతున్నానని తెలిపారు.
సిద్ధరామయ్య తన ట్విట్ లో "హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదు. మన దేశంలోని భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ప్రతి భారతీయుడి కర్తవ్యం.. ప్రతి భాషకు దాని స్వంత గొప్ప చరిత్ర ఉంది. దాని ప్రజలు గర్వపడాలి. నేను కన్నడిగ అయినందుకు గర్విస్తున్నాను!!" అని పేర్కొన్నారు.
మూడు రోజుల క్రితం KGF: చాప్టర్ 2 ఘన విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ,కన్నడ నటుడు-చిత్రనిర్మాత కిచ్చా సుదీప్.. హిందీ ఇకపై జాతీయ భాష కాదని పేర్కొనడంతో ఈ వివాదం మొదలైంది. హిందీ మన జాతీయ భాష కాదన్నారు. కన్నడలో పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి, దీనిపై చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నాను. హిందీ ఇప్పుడు జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ చిత్రాలకు రీమేక్లు చేస్తున్నాడు, కానీ ఆ తర్వాత ఇంకా కష్టపడుతున్నాడు. ఈరోజు ప్రపంచమంతా చూసే సినిమాలు చేస్తున్నాం అని సుదీప్ పేర్కొన్నాడు.
కిచ్చా చేసిన ఈ ట్వీట్పై బాలీవుడ్ సింగం అంటే అజయ్ దేవగన్ ఘాటుగా స్పందించాడు. అజయ్ ట్వీట్ చేస్తూ, "కిచ్చా సుదీప్ నా సోదరా, మీ ప్రకారం హిందీ మన జాతీయ భాష కాకపోతే, మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తారు? హిందీ మన మాతృభాష మరియు జాతీయ భాష ఎప్పటికీ, ప్రస్తుం ఉంది మరియు ఎల్లప్పుడూ ఉంటుంది. జన్ గన్ మాన్" అని ట్వీట్ తో స్పందించాడు.
కిచ్చా సుదీప్.. అజయ్ దేవగన్కి క్లారిటీ ఇస్తూ- 'సార్, నేను చెప్పిన సందర్భంలో, నా పాయింట్ చాలా డిఫరెంట్గా తీసుకున్నట్లు అనిపిస్తుంది. బహుశా నేను మిమ్మల్ని కలిసినప్పుడు మాత్రమే నా పాయింట్ని మీ ముందు బాగా ఉంచగలను. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని, వివాదాలను రెచ్చగొట్టాలని, ప్రచారం చేయాలని నా ఉద్దేశ్యం కాదు. నేనెందుకు ఇలా చేస్తాను సార్?" అని రిప్లై ఇచ్చారు. దేశంలోని ప్రతి భాషను తాను గౌరవిస్తానని కిచ్చ మరో ట్వీట్లో రాశారు. నేను ఈ అంశాన్ని మరింత కొనసాగించదలచుకోలేదు. ఇది ఇక్కడితో ముగియాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పినట్లు అర్థమయ్యేది చెప్పాలని నా ఉద్దేశ్యం కాదు. మీకు చాలా ప్రేమ మరియు శుభాకాంక్షలు. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను అని పేర్కొన్నాడు.