హరికృష్ణ మంచి మిత్రుడు....వెంకయ్యనాయుడు
ఢిల్లీ: రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు హరికృష్ణ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ రోడ్డుప్రమాదంలో మృతిచెందారని తెలిసి చింతిస్తున్నానన్నారు. ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి అని తెలిపారు.
ఢిల్లీ: రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు హరికృష్ణ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ రోడ్డుప్రమాదంలో మృతిచెందారని తెలిసి చింతిస్తున్నానన్నారు. ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి అని తెలిపారు.
నటుడిగా, నాయకుడిగా తండ్రి పేరు నిలబెట్టేందుకు హరికృష్ణ ఎంతో ప్రయత్నించారన్నారు. హరికృష్ణ అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
హరికృష్ణ మృతి మా కుటుంబానికి తీరని లోటు...సీఎం చంద్రబాబు