కారణమిదే: హార్థిక్పటేల్కు రెండేళ్ల జైలు శిక్ష
పాటిదార్ ఉద్యమకారుడు హార్థిక్పటేల్ కు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 2015 లో జరిగిన అల్లర్ల కేసులో హార్థిక్ పటేల్కు ఈ శిక్షను విధించింది కోర్టు.
గాంధీనగర్: పాటిదార్ ఉద్యమకారుడు హార్థిక్పటేల్ కు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 2015 లో జరిగిన అల్లర్ల కేసులో హార్థిక్ పటేల్కు ఈ శిక్షను విధించింది కోర్టు.
2015లో తమ డిమాండ్ల సాధన కోసం హార్థిక్ పటేల్ మద్దతుదారులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకారులు బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన కార్యాలయంపై దాడికి దిగారు.
పాటిదార్ల డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా నిరసనకారులు ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేశారు. సుమారు 5 వేలకు పైగా మంది నిరసనకారులు ఈ దాడిలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు.
బీజేపీ ఎమ్మెల్యే రుషికేశ్ పాటిల్ కార్యాలయంపై 2015లో ఈ దాడి జరిగింది. అయితే ఈ కేసులో హార్థిక్ పటేల్ తో పాటు మరో 17 మందిపై ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి హార్థిక్పటేల్తో పాటు మరో అతని ఇద్దరు అనుచరులకు కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది.