సారాంశం

సెంగోల్ తీసుకొచ్చి ప్రధాని మోడీకి అప్పగిండం ప్రధాని మోడీకి జరిగే పట్టాభిషేకమే అని సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. ట్విట్టర్ పోస్టులో ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. 

మే 28వ తేదీన పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా రాజకీయవర్గాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ఈ వేడుకకు కొన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా దీనిపై వ్యాఖ్యానించారు. కొత్త భవనంలో ఏర్పాటు చేయబోయే ‘సెంగోల్’పై వ్యాఖ్యలు చేస్తూ.. ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. సెంగోల్ మార్పిడి చేసుకొని రాజా- ప్రజా పాలనను మళ్లీ తీసుకొస్తారని ఏచూరి ఆరోపించారు.

పూణెలో లవ్ జిహాద్ కేసు ! ‘ది కేరళ స్టోరీ’ చూశాక బాలిక కుటుంబం కుట్రను గ్రహించింది - బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్

మ్యూజియం నుంచి 'సెంగోల్'ను తీసుకువచ్చి మోడీకి అప్పగించడం అంటే ఆయన పట్టాభిషేకానికి దైవ అనుమతి కోరడానికి ప్రతీక అని పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు భవనంలో దీనిని ప్రముఖంగా ప్రదర్శించడం దేశం, పౌర ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ‘రాజా- ప్రజా’ పాలనకు సంకేతం అని సీతారం ఏచూరీ ట్వీట్ చేశారు. 

ఇదిలావుండగా.. ప్రారంభోత్సవ కార్యక్రమం, ఉత్సవ వేదిక సెంగోల్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది. కొత్త పార్లమెంటు భవనంలో స్పీకర్ కుర్చీకి సమీపంలో సెంగోల్ ను ఏర్పాటు చేయనున్నారు. లార్డ్ మౌంట్ బాటన్, సి.రాజగోపాలాచారి, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూలు సెంగోల్ ను బ్రిటీష్ వారు భారతదేశానికి అధికార బదిలీకి చిహ్నంగా అభివర్ణించిన దాఖలాలు లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సెల్పీ తీసుకుంటుండగా రిజర్వాయర్ లో ఫోన్ పడిపోయిందని.. 21 లక్షల లీటర్ల నీటిని తోడేసిన గవర్నమెంట్ ఆఫీసర్..

తిరువడుతురై ఆదినం, అంబలవన దేశిక పరమాచార్య స్వామి.. జైరాం రమేష్ వాదనలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది 1947 లో భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన అదే సెంగోల్. ఇది తమిళనాడుకు గర్వకారణం’’ అని అన్నారు. దేశ రాజధానిలోని కొత్త పార్లమెంటు భవనంలో ఉంచనున్న సెంగోల్ పై కాంగ్రెస్ అవలంభిస్తున్న వైఖరిపై ఆయన అసంతృప్తి వ్యక్తం శారు. కాగా.. ప్రధాని మోడీ నూతన పార్లమెంటరీ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ సహా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. రాజ్యాంగాధినేత అయిన భారత రాష్ట్రపతి ఈ భవనాన్ని ప్రారంభించాలని ఆ పార్టీలు  వాదిస్తున్నాయి. 

హిందూ యువకుడితో ముస్లిం యువతి డిన్నర్ కు వెళ్లిందని మూక దాడి.. రక్షించేందుకు వచ్చిన ఇద్దరిని పొడిచిన దుండగులు

కాగా.. ప్రతిపక్ష పార్టీల చర్యను పెద్ద సంఖ్యలో బ్యూరోక్రాట్లు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు ఖండించారు. ఈ మేరకు 88 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, 100 మంది అనుభవజ్ఞులు, 82 మంది విద్యావేత్తలు సంతకం చేసి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించినందుకు ప్రతిపక్షాల చర్యలను తప్పుబట్టారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అన్నింటిని బహిష్కరించడానికి ఫ్యామిలీ ఫస్ట్ పార్టీలు కలిసి వచ్చాయని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం భారతీయులందరికీ ఇది గర్వించదగిన సందర్భం అయినప్పటికీ.. అపరిపక్వమైన, విచిత్రమైన, బూటకపు హేతువాదంతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.