Asianet News TeluguAsianet News Telugu

సముద్రవంతెన : భారత్-శ్రీలంక మధ్య 23 కిలోమీటర్ల సముద్ర వంతెన... త్వరలో కార్యరూపంలోకి..

తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న ధనుష్కోడిలో రాముడు తన సైన్యాన్ని లంకకు తీసుకెళ్లడానికి వంతెనను నిర్మించమని వానరసేనను కోరినట్లు పురాణాల కథనం. నాసా చిత్రాలు, ఆ ప్రాంతంలో తేలియాడే రాళ్ల ఉనికి రామసేతు వంతెన, చారిత్రక ఉనికికి బలం చేకూరుస్తున్నాయి. 

Govt plans 23 km sea bridge between India and Sri Lanka, soon to be implemented - bsb
Author
First Published Jan 23, 2024, 9:26 AM IST

చెన్నై : భారత్ లో పర్యాటకం, ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమిచ్చే పెద్ద అడుగుకు శ్రీకారం పడింది. భారత్ - శ్రీలంకలను కలిపే వంతెన నిర్మాణ పనులను భారత ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మన దేశంలోని తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకలోని తలైమన్నార్‌లను కలుపుతూ సముద్రం మీదుగా 23 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మించడానికి గల సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది.

"కొత్త రామసేతు, 23 కి.మీ పొడవు ఉంటుంది. భారతదేశంలోని ధనుష్కోడి, శ్రీలంకలోని తలైమన్నార్ లను పాల్క్ జలసంధి మీదుగా కలిపే రహదారి లేదా రైలు సముద్ర మార్గం. ఇది సేతుసముద్రం ప్రాజెక్ట్ ప్రత్యామ్నాయం. దీని ద్వారా రవాణా ఖర్చును 50 శాతం తగ్గించడం, లంక ద్వీపానికి ప్రధాన భూభాగాన్ని అనుసంధానం చేయడం జరుగుతంది. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియా (NHAI) ద్వారా చేయబడుతుంది అని ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు.

అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ట రోజే... సరికొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ

ఆరు నెలల క్రితం ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 40,000 కోట్ల రూపాయల అభివృద్ధికి మార్గం సుగమం చేసిందని తెలిపారు. ఇందులో కొత్త రైలు మార్గాలు, రామసేతుతో ఎక్స్‌ప్రెస్‌వే, ఏడీబీ మద్దతుతో త్వరలో ప్రారంభం కానున్న సాధ్యాసాధ్యాల అధ్యయనానికి మార్గం సుగమం చేసిందని వారు తెలిపారు.

తమిళనాడులోని ధనుష్కోడి సమీపంలోని రామసేతు ప్రారంభ బిందువుగా భావించే అరిచల్ మునైని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న సందర్శించిన సంగతి తెలిసిందే.

తమిళనాడులోని ధనుష్కోడిని శ్రీలంకలోని తలైమన్నార్‌ను కలుపుతూ ‘రామసేతు’గా పిలవబడే రాముని ప్రాముఖ్యతతో స్ఫూర్తి పొంది 23 కిలోమీటర్ల సముద్ర వంతెనను నిర్మించాలని భారతదేశం పరిశీలిస్తోంది.

'రామసేతు' సంగం రోజుల నుండి అసంఖ్యాక తమిళ గ్రంథాలలో, తమిళ రాజుల అనేక శాసనాలు/రాగి రేకులలో కూడా దీని ప్రస్తావన ఉంది. రామనాథపురం సేతుపతిలు ఈ స్థలాన్ని ఎంతో గౌరవంగా చూసుకుంటారు. వారి మంజూరులన్నీ ఈ పవిత్ర స్థలంలో 'రిజిస్టర్' చేయబడ్డాయి. అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ ఇక్కడ తన ఆధ్యాత్మిక పర్యటనపై సంతకం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios