దోమల బెడదను తప్పించేందుకు కొత్త టెక్నాలజీని ఐసీఎంఆర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే దోమల నుంచి వచ్చే అనేక రోగాల నుంచి మానవాళి తప్పించుకోవచ్చు. 

దోమ‌లు మ‌నుసుల్ని అనారోగ్యం బారిన ప‌డేలా చేస్తాయి. జ్వ‌రాలు, దద్దర్లు, వాటి వ‌ల్ల వ‌చ్చే స్కిన్ ఇన్ఫెక్ష‌న్లు ఇలా చెప్పుకుంటూ ఈ లిస్ట్ లో చాలానే చేర‌తాయి. అయితే ఇప్పుడు వీటి భారి నుంచి మ‌నుషుల్ని కాపాడేందుకు, దోమ‌ల్ని అంతం చేసేందుకు పుదుచ్చేరిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిశోధనా కేంద్రం బాసిల్లస్ తురింజియెన్సిస్ ఇస్రాయెలెన్సిస్ (Bti strain VCRC B-17) స్ట్రెయిన్ బ్యాక్టీరియా ను ఉత్ప‌త్తి చేసే కొత్త టెక్నాలజీని డెవ‌ల‌ప్ చేసింది. అయితే ఇది జంతుజాలానికి, కీట‌కాల‌కు హాని క‌లిగించ‌కుండా కేవ‌లం దోమ‌ల‌పైనే ప‌ని చేస్తుంది. 

గుజరాత్ పోలీసు ట్విట్టర్ ఖాతా హ్యాక్.. ఎలన్ మస్క్ అకౌంట్‌గా మార్చిన దుండగులు

ఈ బ్యాక్టీరియా ఇతర జంతువులకు హాని కలిగించకుండా దోమలు, నల్ల ఈగ లార్వాలను చంపుతుంది. ప్ర‌స్తుతం దోమ‌ల నియంత్రంణ కోసం Bti బ్యాక్టీరియా దశాబ్దాల కాలం నుంచి అందుబాటులో ఉంది. ఇతర జంతువులకు, పర్యావరణానికి సురక్షితమైనదిగా దీనిని ప‌రిగ‌ణిస్తున్నారు. ఈ విష‌యంపై ICMR వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అశ్వనీ కుమార్ మాట్లాడుతూ.. “ కొత్త సాంకేతిక‌త ప్రత్యేకత ఏమిటంటే ఇది దోమ, బ్లాక్‌ఫ్లై లార్వాలను మాత్రమే చంపుతుంది. ఇతర కీటకాలు, జల జంతుజాలం అలాగే క్షీరదాలకు ఎలాంటి హ‌నీ కలిగించదు. VCRC Bti సాంకేతికత దాని ప్రభావం పరంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) స్టాండర్డ్ స్ట్రెయిన్ బ్యాక్టీరియాకు సమానం. మా Bti B-17 జాతిని విస్తృతంగా ప‌రీక్షించాం. అది ఇప్పుడు సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా ఇండియన్ స్టాండర్డ్ స్ట్రెయిన్‌గా గుర్తించబడింది. అయితే ఇప్పటి వరకు ఈ సాంకేతికత కోసం 21 కంపెనీలకు లైసెన్స్ అందాయి’’ అని తెలిపారు. 

ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు ఇద్దాం.. : ఉద్ధవ్ ఠాక్రేతో శివసేన ఎంపీలు

ఈ బ్యాక్టీరియాను వాణిజ్య ప‌రంగా ఉత్ప‌త్తి చేస్తే మలేరియా, ఫైలేరియా, జపనీస్ ఎన్సెఫాలిటిస్, డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వంటి వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులను అంతం చేసేందుకు భార‌తదేశం చేస్తున్న పోరాటంలో గొప్ప ముంద‌డుగుగా చెప్పుకోవ‌చ్చు. కాగా గత నెలలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా భారతదేశంలో ఈ బ్యాక్టీరియాను వాణిజ్యపరంగా ఉత్ప‌త్తి చేసేందుకు హిందూస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్‌కు BTI సాంకేతికతను అందజేశారు. అయితే ఆఫ్రికన్ దేశాలలో రివర్ బ్లైండ్‌నెస్‌ని వ్యాపింపజేసే దోమల వల్ల కలిగే వ్యాధులు, నల్ల ఈగలు బారిన పడే ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల ప్రాంతాలకు Bti బయో-లార్విసైడ్‌లను ఎగుమతి చేయాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ కంపెనీ యోచిస్తోంది. 

దాదాపు ఒక శతాబ్దం పాటు దోమల నియంత్రణ కోసం రసాయనిక క్రిమిసంహారకాల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నామ‌ని నిపుణులు తెలిపారు. వీటి వల్ల పర్యావరణానికి ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. దీంతో పాటు ఆ ర‌సాయ‌ణాల‌కు వ్య‌తిరేకంగా దోమ‌లు రోగ నిరోధ‌క‌త‌ను అభివృద్ధి చేసుకుంటున్నాయి. అందువ‌ల్ల ఇప్పుడు Bti వంటి బయోకంట్రోల్ ఏజెంట్ల వాడకంపై దృష్టి కేంద్రీక‌రిస్తున్నామ‌ని సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అశ్వనీ కుమార్ తెలిపారు. ఈ బ్యాక్టీరియాను దోమ‌ల లార్వాలు తీసుకున్న‌ప్పుడు అందులో ఉన్న ట్యాక్సిన్ ప‌ని లార్వాలో ఉండే పేగుల‌ను 10-15 నిమిషాల్లో నాశానం చేస్తాయి. 

జనాభాలో చైనాను దాటేయబోతున్న ఇండియా.. 2023లో అత్యధిక జనాభా మన దేశంలోనే..: యూఎన్ రిపోర్టు

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. భారతదేశంలో మే వరకు 10,172 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మూడు మరణాలు కూడా సంభ‌వించాయి. ఈ ఏడాది జూన్‌ వరకు దాదాపు 1,554 చికున్‌గున్యా కేసులు నమోదు కాగా, ఏప్రిల్‌ వరకు 21,558 మలేరియా కేసులు, న‌మోదు అయ్యాయి. నాలుగు మరణాలు సంభ‌వించాయి.