Asianet News TeluguAsianet News Telugu

ఫ్రమ్ ది ఇండియా గేట్: సీఎం విజయన్‌‌ ఆగ్రహానికి కారణమేమిటి?.. కర్ణాటకలో రాజకీయ నీతి..

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

from the india gate what is the reason for anger in cm vijayan and sangh political ethics in karnataka and more ksm
Author
First Published Sep 24, 2023, 3:38 PM IST

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

సీఎం విజయన్‌‌ ఆగ్రహానికి కారణమేమిటి?
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లో ఆగ్రహం అగ్ని పర్వతం మాదిరిగా ఎగసిపడింది. అయితే విజయన్‌‌లో ఆగ్రహం రేకెత్తించిన కారణాలు మిస్టరీగా మిగిలిపోయాయి. విజయన్‌ను కలవరపెట్టిన ఘటన ఏమిటి?,  పదునైన మాటలతో కోపం ఎందుకు వచ్చింది? అని ఎవరూ ఊహించలేకపోతున్నారు. అసలు జరిగిందేమిటంటే.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో విజయన్ ప్రసంగాన్ని ముగించే క్రమంలో తదుపరి మాట్లాడబోయే వ్యక్తి పేరును ప్రకటించారు. అనౌన్సర్ గొంతులో నుంచి మాటలు వెలువడగానే.. కోపోద్రిక్తుడైన విజయన్ గుచ్చుతున్న చూపుతో నిర్వాహకుల వైపు చూశారు. 

‘‘ఇది ఏ సంస్కృతి? నేను ముగించేలోపు అతడు ఎలా ప్రకటన చేయగలడు’’ అని బయటకు వెళ్లే ముందు విజయన్ అక్కడివారిని అడిగాడు. ఈ ఘటన వెంటనే వైరల్‌గా మారింది. కొన్ని గంటల తర్వాత విజయన్ మరో కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘నేను ప్రకటన చేసిన వ్యక్తిని మాత్రమే సరిదిద్దుతున్నాను. ఇది నా బాధ్యత.  నేను అటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలను గుర్తించినప్పుడల్లా ఈ వైఖరిని కొనసాగిస్తున్నాను’’ అని అన్నారు. అయితే విజయన్ ముఖంలో అతికించిన చిరునవ్వు కాస్త కృత్రిమంగా కనిపించలేదా?. 

రెడ్ కార్డ్..
ప్రతిపక్ష ఇండియా కూటమి బలపడేందుకు ప్రయత్నాలు  కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు సీపీఐ లేవనెత్తిన ఆందోళన చర్చనీయాంశంగా మారింది. దీంతో రాహుల్ గాంధీ మళ్లీ వయనాడ్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ఎలా? అనే చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తే.. అక్కడ ఎల్‌డీఎఫ్‌ నుంచి పోటీ ఎదుర్కొవాల్సి ఉంది. ఇటీవల జరిగిన సీపీఐ కార్యవర్గ సమావేశంలో కేరళకు చెందిన ఓ నేత ఈ అంశాన్ని లేవనెత్తారు. 

ఇటీవల జరిగిన సీపీఐ కార్యవర్గ సమావేశంలో కేరళకు చెందిన ఓ నేత ఈ అంశాన్ని లేవనెత్తారు. రాహుల్‌ను మళ్లీ వాయనాడ్‌ నుంచి పోటీకి దింపకూడదనే అభిప్రాయాన్ని వెలువరించారు. చాలా మంది ఆయనకు మద్దతు ఇవ్వనప్పటికీ.. ఈ సమస్య కేరళలోని యూడీఎఫ్, సీపీఐల మధ్య విమర్శలతో ఫ్రంట్‌ను కదిలించే ప్రమాదం ఉంది. ఈ పగుళ్లు లోతుగా పెరిగితే.. కేరళలో ఇండియాకు వేరే ఆట అవసరం. 

రాజకీయ నీతి.. 
రాజకీయాల్లో నైతికత కనుమరుగవుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ సంఘ్.. కర్ణాటకలో దానిని నేటి దృష్టాంతంలో ఎలా ఆచరించవచ్చో ప్రదర్శించింది. బిజమన్ గోవింద బాబు పూజారికి హిందూ నాయకురాలు చైత్ర కుందాపూర్ టిక్కెట్టు హామీ ఇచ్చారు. కానీ తుది జాబితా ప్రకటించినప్పుడు బిజమన్ గోవింద బాబుకు అతని పేరు కనిపించలేదు. దీంతో ఉడిపిలోని బీజేపీ నేతలకు ఫిర్యాదు చేసినా.. పోలింగ్ పూర్తయ్యే వరకు మౌనంగా ఉండాలని సూచించారు. నిజానికి.. బైందూరులోని గురురాజ్ గంటిహోల్‌కు మద్దతు పని చేయాలని ఆదేశించారు.

నిస్సహాయుడైన బిజమన్ గోవింద బాబు ఒక ఫిర్యాదును రూపొందించారు. ఈ చర్యతో తన డబ్బును తిరిగి పొందగలుగుతాను అనే ఆశతో చైత్రకు షేర్ చేశాడు. కానీ చైత్ర అతనిని బెదిరించింది. అతని కార్యాలయంలోనే ఆత్మహత్య నాటకాన్ని కూడా ప్రదర్శించింది. తర్వాత, సంఘ్ నాయకులు.. అభినవ హల్‌శ్రీ, గగన్‌తో సహా చైత్ర కోటరీతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కారాన్ని రూపొందించారు. కానీ వారు పాస్ చేస్తూ ఆడటం కొనసాగించారు. .

ఇక, గోవింద బాబు పూజారి సంఘ్ నాయకులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎవరైనా పార్టీ పేరును ఉపయోగించి లంచాలు తీసుకుంటే అది ప్రతిబంధకంగా ఉండేలా పోలీసు ఫిర్యాదు చేయాలని అతడికి సూచించబడింది. 

మొగ్గలోనే తుంచివేయబడింది.. 
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కలిసిన అన్నాడీఎంకే నేతలు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై, జయలలితపై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ అన్నామలైని ఆ పదవి నుంచి తొలగించాలని బీజేపీని కోరారు. అన్నామలైపై చర్యలు తీసుకోకుంటే కూటమి నుంచి తప్పుకుంటామని అన్నాడీఎంకే నేతలు బీజేపీ బెదిరించారు. 

అయితే బీజేపీ అగ్రనేతలు ఎవరూ వారి వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. దీనికి విరుద్ధంగా బీజేపీ నేతలు ఈ సమావేశాన్ని ఉపయోగించి.. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేను బీజేపీ మిత్రపక్షంగా 15 స్థానాల నుంచి మాత్రమే పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు.

గుంపు భయం..
సాధారణంగా రాజకీయ నాయకుడి చుట్టూ గుంపులు గుంపులుగా చేరడం కొత్తేమీ కాదు. అయితే జైపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరికి ఈ పరిణామం పీడకల అనుభవాన్ని మిగిల్చింది. అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుని టికెట్‌ పంపిణీపై నివేదిక సిద్ధం చేయాలని హైకమాండ్‌ ఆదేశాల మేరకు ఆయన జైపూర్‌ చేరుకున్నారు. జైపూర్ చేరుకోగానే ఆయనకు గట్టి షాక్ తగిలింది. దాదాపు 400 మంది టిక్కెట్‌ ఆశించేవారు ఆయన కారుపై దాడి చేశారు. ప్రతి ఒక్కరూ ఆయన దృష్టిని ఆకర్షించే ప్రయత్నం  చేశారు. 

గుమికూడిన జనాన్ని చూసి ఆ నాయకుడు కారు దిగకూడదని నిర్ణయించుకున్నారు. ప్రతిష్టాత్మక నాయకులు కూడా కారును చుట్టుముట్టినప్పటికీ ఆయన లోపలే కూర్చున్నారు. ఆయన చాలా భయపడ్డారు. అతన్ని సురక్షితంగా తీసుకురావడానికి రాష్ట్ర నాయకుడికి ఫోన్ చేయవలసి వచ్చింది. వెంటనే నేతాజీని కారులోంచి బయటకు తీసుకొచ్చారు. రెండు గంటల విశ్రాంతి తర్వాత మాత్రమే ఆయన మాట్లాడరని సంబంధిత వర్గాలు తెలిపాయి. తర్వా ఆయన గొణుగుతూ చెప్పిన మొదటి మాట.. ‘‘ టిక్కెట్ పంపిణీ గురించి చర్చించడానికి జైపూర్‌కు ఇకపై ప్రయాణం లేదు’’.

Follow Us:
Download App:
  • android
  • ios