చీరల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట.. నలుగురు మహిళలు దుర్మరణం
తమిళనాడులో తైపుసం పండుగ సందర్భంగా ఓ వ్యాపారి ఉచితంగా చీరలను పంచి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం టోకెన్లు అందించే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇక్కడే తొక్కిసలాట జరిగింది. దీంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
చెన్నై: తమిళనాడులో తైపుసం పండుగను పురస్కరించుకుని ఓ వ్యక్తి చీరలను పంచాలని నిర్ణయం తీసుకున్నాడు. కొద్ది సంఖ్యలో ఉచితంగా చీరలను పంచాలని అనుకున్నాడు. అనుకున్నట్టే చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాడు. అయితే, ఈ కార్యక్రమానికి తాను అనుకున్న దాని కన్నా ఎక్కువ మంది మహిళలు వచ్చారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: రూ. 2 వేలకు కక్కుర్తి పడి.. ఆ పని చేస్తూ పట్టుబడ్డ ప్రముఖ హాలీవుడ్ నటి, పోలీసు కేసు నమోదు
ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో వనియంబడిలో చోటుచేసుకుంది. తైపుసం పండుగ సందర్భంగా ఓ బిజినెస్ మ్యాన్ వెష్టీస్, చీరలను ఉచితంగా పంపిణీ చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం ముందుగా టోకెన్లు ఇచ్చాడు. ఆ తర్వాత టోకెన్లను చూపించి చీరలను పొందాలని సూచించాడు. టోకెన్ల కోసం మహిళలు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు మహిళలు మరణించినట్టు తిరుపత్తూరు పోలీసు అధికారులు తెలిపారు.
ఒడిశాలోని ప్రసిద్ధ మకరమేళాకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా బరాంబ-గోపీనాథ్పూర్ టీ-బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. దాదాపు డజను మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ బంధువులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గత నెలలో ఈ ఘటన జరిగింది.