దారుణం: కారులో భర్త ఎదుటే భార్యపై గ్యాంగ్రేప్
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకొంది. మానవత్వాన్ని మరిచిపోయిన దుండగులు కారులో భార్యపై భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు 8 మాసాల గర్భిణీ. అయినా కూడ నిందితులు కనికరం చూపలేదు.
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకొంది. మానవత్వాన్ని మరిచిపోయిన దుండగులు కారులో భార్యపై భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు 8 మాసాల గర్భిణీ. అయినా కూడ నిందితులు కనికరం చూపలేదు.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో బాధితురాలు ఆమె భర్త ఓ హోటల్ను నడుపుతున్నారు. అయితే ఈ హోటల్లో పనిచేసేందుకు గాను జంటకు పనిమనుషుల్ని చూపిస్తామని నమ్మబలికిన ఓ నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
హోటల్లో పనిచేసేందుకు మరో ఇద్దరు పనిమనుషులు వీరికి అవసరమయ్యారు. పని మనుషులను చూపిస్తామని బాధితురాలిని, ఆమె భర్తను ముకుంద్ మాన్ సంప్రదించాడు. తుర్చిఫాటా ప్రాంతంలో ఓ జంట హోటల్ లో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారని ముకుంద్ మాన్ నమ్మబలికాడు. అయితే వారికి రూ. 20 వేలు అడ్వాన్స్ ఇవ్వాలని సూచించాడు.
దీంతో భార్యతో కలిసి హోటల్ యజమాని తుర్చిఫాటాకు వెళ్లాడు. అక్కడే మరో 8 మంది నిందితులతో కలిసి ముకుంద్ అతనిపై కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం అతడిని కారులో కట్టేసి బాధితురాలిపై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. బాధితురాలి వద్ద ఉన్న బంగారాన్ని దోచుకొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.