మత విద్వేషాలు సృష్టించే శక్తులపై పోరాడాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ వ్యూహాలు పన్నుతోందని ఆరోపించారు. 

మహారాష్ట్రతో పాటు దేశంలో మత విభేదాలు సృష్టించే శక్తులపై పోరాడాల్సిన అవసరం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సోమవారం అన్నారు. తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ సొంత పార్టీలో చీలిక తెచ్చి, షిండే-బీజేపీ కూటమిలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మరుసటి రోజు ఆయన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ పన్నిన వ్యూహాలకు తమలో కొందరు బలైపోయారని అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వాహనాన్ని తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ ను వేగంగా ఢీకొట్టిన కారు.. గాయాలతో అక్కడే మృతి చెందిన పోలీసు..

మహారాష్ట్రలో, దేశంలో మత విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని శరద్ పవార్ అన్నారు. శాంతికాముకులైన పౌరుల్లో భయాందోళనలు సృష్టించే శక్తులతో పోరాడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Scroll to load tweet…

శరద్ పవార్ కరాడ్ లోని తన గురువు, మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్ రావ్ చవాన్ సమాధిని సోమవారం ఆయన సందర్శించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన గురువుకు ఆయన నివాళి అర్పించారు. అజిత్ పవార్ ఎన్సీపీలో చీలికకు నేతృత్వం వహించిన మరుసటి రోజే గురుపౌర్ణమి రావడం, ఈ సందర్భంగా దివంగత చవాన్ స్మారక చిహ్నం 'ప్రీతరంగం'ను సందర్శించడం ఆయన బలప్రదర్శనగా భావిస్తున్నారు.

పార్టీలోకి తిరిగి రండి - రెబల్ ఎమ్మెల్యేలకు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే విజ్ఞప్తి

కాగా.. అయితే శరద్ పవార్ సోమవారం ఉదయం పుణె నుంచి కరాడ్ కు బయలుదేరి మార్గమధ్యంలో ఆచి రోడ్డు పక్కన క్యూ కట్టిన మద్దతుదారులను కలుసుకుని ఆయనకు స్వాగతం పలికారు. కరాడ్ లో ఆయనకు వేలాది మంది మద్దతుదారులు, స్థానిక ఎన్సీపీ ఎమ్మెల్యే బాలాసాహెబ్ పాటిల్ స్వాగతం పలికారు. కరాడ్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.