Asianet News TeluguAsianet News Telugu

ల్యాండ్ అవుతుండగా జారిపోయి ప్రైవేట్ జెట్ క్రాష్.. ముంబయి ఎయిర్‌పోర్టులో ఘటన

ముంబయి ఎయిర్‌పోర్టులో ఓ ప్రైవేట్ జెట్ రన్ వేపై జారిపోయింది. క్రాష్ అయింది. కొద్దిగా మంటలు కూడా వచ్చాయి. ఎమర్జెన్సీసర్వీసెస్ వెంటనే ఆర్పివేశాయి. ప్రమాద సమయంలో ఎనిమిది మంది జెట్‌లో ఉన్నారు. ముగ్గురిని హాస్పిటల్‌‌లో చేర్చారు.
 

flight accident reported in mumbai airport, flight veered off from run way kms
Author
First Published Sep 14, 2023, 7:24 PM IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి ఎయిర్‌పోర్టులో ఓ ప్రైవేట్ జెట్ రన్ వే పై జారిపోయింది. రన్ వే పక్కకు వెళ్లి క్రాష్ అయింది. విశాఖపట్నం నుంచి ముంబయికి వెళ్లిన విమానం గురువారం ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఆ ప్రైవేట్ జెట్‌లో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు క్యాబిన్ క్రూలు ఉన్నారు. ముగ్గురిని హాస్పిటల్‌కు తరలించినట్టు ఎమర్జెన్సీ సర్వీసెస్ వెల్లడించింది. అయితే, వారి గాయాల తీవ్రత గురించి తెలియరాలేదు.

వర్షం కురవడం వల్ల రన్ వే జారుడుగుణాన్ని సంతరించుకుంది. ఈ ఘటన రన్ వే 27 పై చోటుచేసుకుంది. రన్ వే జారుడుగా ఉండటంతోపాటు విజిబిలిటీ కూడా తగ్గిపోయింది. అప్పుడు విజిబిలిటీ 700 మీటర్ల దూరం ఉండొచ్చని చెబుతున్నారు.

Also Read: భార్యపై తండ్రి రేప్.. ఇప్పుడు నువ్వు నా మమ్మివి అని వదిలేసిన భర్త

అక్కడి నుంచి బయటికి వచ్చిన దృశ్యాల ప్రకారం ఆ విమానం జారుకుంటూ పోయినట్టు అర్థం అవుతుంది. ప్రైవేట్ జెట్ డ్యామేజీ కనిపించింది. తొలుత ఆ ఫ్లైట్ నుంచి మంటలు కనిపించాయి. అయితే, వాటిని ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్పివేశాయి.

ఈ ప్రమాదంతో ఆ రన్ వేను కొద్ది సేపు క్లోజ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios