న్యూ ఇయర్ బంపర్ ఆఫర్: ఆడపిల్ల పుడితే రూ.5లక్షలు
నూతన సంవత్సరం వస్తుందంటే చాలు అంబరాలు సంబరాన్నంటుతాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు వస్తూ ఉంటాయి. అన్ని రంగాల్లో ఆపర్ల పై ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటారు. అయితే కర్ణాటక రాష్ట్రం జనశంకరి మేయర్ గంగాంబిక న్యూఇయర్ వేడుల్లో భాగంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు.
కర్ణాటక : నూతన సంవత్సరం వస్తుందంటే చాలు అంబరాలు సంబరాన్నంటుతాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు వస్తూ ఉంటాయి. అన్ని రంగాల్లో ఆపర్ల పై ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటారు. అయితే కర్ణాటక రాష్ట్రం జనశంకరి మేయర్ గంగాంబిక న్యూఇయర్ వేడుల్లో భాగంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు.
2019 న్యూ ఇయర్ రోజున అంటే జనవరి ఒకటిన జన్మించే 24 మంది ఆడపిల్లలకు రూ.5లక్షలు బంపర్ ఆఫర్ ప్రకటించారు. బుధవారం బీబీఎంపీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మేయర్ గంగాంబికా గత ఏడాది నుంచి బీబీఎంపీ పింక్ బేబీ పేరుతో న్యూ ఇయర్ మొదటి రోజున జన్మించిన ఆడపిల్లలకు రూ.5 లక్షలు అందించే పథకం అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఈ ఏడాది కూడా పింక్ బేబి పథకాన్ని కొనసాగిస్తామని మేయర్ స్పష్టం చేశారు. బీబీఎంపీ పరిధిలోని పాలికె 24 ఆసుపత్రిల్లో ఏడాది మొదటిరోజు పుట్టిన 24 మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందజేస్తామని ఆ సొమ్మును వారికి ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు.
ఈసారి పింక్బేబి పథకం వల్ల ఆడపిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని వచ్చే డబ్బుతో వారు మెరుగైన విద్యను పొందగలరని తెలిపారు. అయితే జనవరి 1న జన్మించిన మొదటి మగబిడ్డకు ఈ పథకం వర్తించదని తెలిపారు. ఒక వేళ జనవరి1న ఆడపిల్లలు జన్మించకుండా 2న పుట్టినా అలాంటి ఆడపిల్లలకు రూ.5 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని మేయర్ గంగాంబిక ప్రకటించారు.