సారాంశం

పద్మ అవార్డులు భారతదేశంలోని అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటి. ఈ అవార్డులు, వాటి అర్హత, పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ మధ్య తేడాలు, ఇతర వివరాలు తెలుసుకోండి.
 

1954లో ప్రారంభమైన పద్మ అవార్డులు భారతదేశ అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రకటిస్తారు. అయితే 1978-1979, 1993-1997 మధ్య అవార్డులను ప్రదానం చేయలేదు అవార్డులు మూడు విభాగాల్లో అందిస్తారు: పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ, ఇవి ప్రజాసేవకు సంబంధించిన అన్ని రంగాల్లో విశిష్ట ప్రతిభను గుర్తించడమే లక్ష్యంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక అవార్డులు ప్రతి సంవత్సరం భారత ప్రధానమంత్రి నియమించే పద్మ అవార్డుల కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రదానం చేస్తారు.

మూడు పద్మ అవార్డుల మధ్య తేడాలను చూద్దాం:

పద్మ విభూషణ్

పద్మ భూషణ్

పద్మ శ్రీ

ఇది భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర గౌరవం.

ఇది భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర గౌరవం.

ఇది భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర గౌరవం.

అసాధారణ, విశిష్టమైన సేవలకోసం ప్రదానం చేస్తారు.

ఉన్నత స్థాయి విశిష్ట సేవలకోసం ప్రదానం చేస్తారు.

విశిష్ట సేవలకోసం ప్రదానం చేస్తారు.

దీని పూర్వపు పేరు "మొదటి వర్గం (క్లాస్ I)".

దీని పూర్వపు పేరు "రెండో వర్గం (క్లాస్ II)".

దీని పూర్వపు పేరు "మూడో వర్గం (క్లాస్ III)".

1954లో మొత్తం ఆరుగురు అవార్డు పొందారు.

1954లో మొత్తం 23 మంది అవార్డు పొందారు.

1954లో మొత్తం 17 మంది అవార్డు పొందారు.

 

పద్మ అవార్డుల గురించి వివరాలు

భారత ప్రభుత్వం ప్రారంభించిన భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులు తర్వాత మూడు విభాగాలుగా విభజించబడ్డాయి: పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ.

భారత రత్న:
భారతదేశ అత్యున్నత పౌర గౌరవం. ఇది ఏదైనా రంగంలో అత్యున్నత ప్రతిభకు గాను ప్రదానం చేస్తారు.

  • అవార్డుకు సిఫారసులను ప్రధాన మంత్రి రాష్ట్రపతికి చేస్తారు.
  • సంవత్సరం ముగ్గురు కన్నా ఎక్కువ మంది అవార్డుకు అర్హులు కారు.

పద్మ అవార్డుల అర్హత:
జాతి, వృత్తి, లింగం వంటి భేదాలు లేకుండా అందరూ అర్హులు. వైద్యులు శాస్త్రవేత్తలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కారు.
అవార్డును సాధారణంగా మరణానంతరం ఇవ్వరు. కానీ ప్రత్యేక సందర్భాల్లో ఇవ్వవచ్చు.

పద్మ అవార్డులు ప్రదానం చేసే రంగాలు
  1. కళలు: సంగీతం, చిత్రకళ, శిల్పకళ, ఫోటోగ్రఫీ, సినిమా, నాటకం మొదలైనవి.
  2. సామాజిక సేవ: సమాజం కోసం సేవ, సహాయ కార్యక్రమాలు మొదలైనవి.
  3. పబ్లిక్ అఫైర్స్: న్యాయం, రాజకీయాలు మొదలైనవి.
  4. శాస్త్రం & ఇంజినీరింగ్: అంతరిక్షం, సాంకేతికత, పరిశోధనలు మొదలైనవి.
  5. వాణిజ్యం & పరిశ్రమ: బ్యాంకింగ్, టూరిజం, బిజినెస్ మొదలైనవి.
  6. వైద్యం: ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి మొదలైనవి.
  7. సాహిత్యం & విద్య: పాత్రికేయం, కవిత్వం, విద్యలో అభివృద్ధి మొదలైనవి.
  8. సివిల్ సర్వీస్: పరిపాలనలో విశిష్ట ప్రతిభ.
  9. క్రీడలు: క్రీడలు, యోగా, అడ్వెంచర్ మొదలైనవి.
  10. ఇతరాలు: భారతీయ సంస్కృతి ప్రచారం, వన్యప్రాణుల సంరక్షణ మొదలైనవి.

పద్మ అవార్డుల ముఖ్యాంశాలు

  1. అవార్డులు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేయబడతాయి.
  2. అవార్డు గ్రహీతకు రాష్ట్రపతి సంతకం ఉన్న సనద్, పతకం అందజేస్తారు.
  3. అవార్డులు గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురిస్తారు.
  4. ప్రతి సంవత్సరం 120 మందికి మించకుండా అవార్డులు ప్రదానం చేస్తారు.
  5. అవార్డులను పేరు ముందు/వెనుక ఉపయోగించడం నిషిద్ధం.