పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయలని రాష్ట్ర గవర్నర్ జగ్జీవ్ దంకర్ సీఎం మమత బెనర్జీకి లేఖ రాశారు.బెంగాల్ రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిందని ఆయన అభివర్ణించారు. పోలీస్ కస్టడీలో మరణించిన మదన్ గొరాయి మరణించిన విషయం తెలిసిందే.


న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయలని రాష్ట్ర గవర్నర్ జగ్జీవ్ దంకర్ సీఎం మమత బెనర్జీకి లేఖ రాశారు.బెంగాల్ రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిందని ఆయన అభివర్ణించారు. పోలీస్ కస్టడీలో మరణించిన మదన్ గొరాయి మరణించిన విషయం తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ఘటన అమానవీయమైన ఘటన అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన, రాజకీయ హింస, కక్షసాధింపు చర్యలు, కస్టడీ వేధింపులు పెచ్చుమీరాయని గవర్నర్ ఆరోపించారు.

సీఎం మమత బెనర్జీకి గవర్నర్ రాసిన లేఖలో ఈ విషయాలను ప్రస్తావించారు.ఈ తరహా ఘటనలు చట్ట నిబంధనల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని సీఎంకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

also read:బెంగాల్ సీఎం మమతపై అనుచిత వ్యాఖ్యలు: బీజేపీ నేతకు కరోనా

రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. పోలీసుల రాజ్యంగా రాష్ట్రం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.ఈ తరహా ఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.