నకిలీ యాప్‌లతో ప్రజలను మోసం చేస్తున్న చైనా ముఠాను న్యూఢిల్లీ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు.  

న్యూఢిల్లీ: నకిలీ యాప్‌లతో ప్రజలను మోసం చేస్తున్న చైనా ముఠాను న్యూఢిల్లీ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. నకిలీ యాప్ ల ద్వారా సుమారు 5 లక్షల మందిని ఈ ముఠా మోసగించిందని పోలీసులు తెలిపారు. పవర్ బ్యాంక్, సన్ ఫ్యాక్టరీ,ఏజ్‌ప్లాన్ వంటి యాప్ ల ద్వారా ప్రజలను మోసం చేశారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ ముఠాను అరెస్ట్ చేసినట్టుగా ఢిల్లీ సైబర్ సెల్ డీసీపీ అన్వేష్ రాయ్ ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…
Scroll to load tweet…

also read:హైద్రాబాద్‌ పోలీసులకు ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల బురిడీ: కోటిన్నర నగదు డ్రా

also read:ఆన్‌లైన్ యాప్‌లతో రూ. 11 వేల కోట్ల ఆర్జన: చార్జీషీట్‌లో పోలీసులు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ లోన్ యాప్ ల ద్వారా చైనా కు చెందిన కొందరు పెద్ద మొత్తంలో డబ్బులను చైనాకు తరలించాలరు. ఈ మేరకు తెలంగాణకు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో చార్జీషీట్ ను కూడ పోలీసులు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలకసూత్రధారి జెన్నీఫర్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. లోన్ యాప్ తరహలోనే ఫేక్ యాప్ లను తయారు చేసి డబ్బులు దండుకోవడంలో ఈ చైనా ముఠాపై అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.