Asianet News TeluguAsianet News Telugu

ఎగ్జిట్ పోల్ ఫలితాలు: కేజ్రీవాల్ కి మరోసారి పట్టం కట్టిన ఢిల్లీ

ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి.పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరు మొదలయింది.

Delhi exit poll: AAP to form the government in Delhi predicts
Author
New Delhi, First Published Feb 8, 2020, 7:05 PM IST

ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం తథ్యం అని తేల్చి చెప్పాయి. ఇండియా టుడే- ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ మొదలు రిపబ్లిక్ జన్ కి బాత్ సర్వే వరకు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేసాయి. 

also read ఢిల్లీ ఎగ్జిట్ పోల్: హస్తిన మళ్ళీ ఆప్ హస్తగతం... స్పష్టం చేసిన టైమ్స్ నౌ

70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో మేజిక్ మార్కు 36. ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం తథ్యం అని అందరూ చెబుతున్నప్పటికీ.... సీట్ల విషయంలో మాత్రమే తేడా కనబడుతుంది. న్యూస్ ఎక్స్ వంటి సంస్థలు ఆప్ 57 సీట్ల వరకు గెలవొచ్చు అని చెబుతుంటే... న్యూస్ 18 వంటి సంస్థలు 45 సీట్లకే ఆప్ పరిమితం అవ్వొచ్చని అంటున్నారు. 

ఈ అన్ని ఎగ్జిట్ పోల్స్ పై మనము కూడా ఒక లుక్కేద్దాం. 

న్యూస్ ఎక్స్ 

ఆప్ 53 నుంచి 57 సీట్లను గెలుచుకుంటుందని,  బిజెపి11 నుంచి 16 సీట్లను గెలుస్తుందని, కాంగ్రెస్ 0-2 సీట్లకు పరిమితమవ్వొచ్చని తెలిపింది.  

also read ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్: ఢిల్లీలో మరోసారి సర్కారును ఏర్పాటు చేయనున్న కేజ్రీవాల్...న్యూస్ ఎక్స్ సర్వే

టైమ్స్ నౌ 

ఆప్ 44 సీట్లను గెలుచుకుంటుందని, బీజేపీ 26 సీట్లను గెలుస్తుందని, కాంగ్రెస్ ఖాతా తెరవదని తెలిపింది.  

రిపబ్లిక్ జన్  కి బాత్

ఆప్ 48 నుంచి 61 సీట్లను గెలుచుకుంటుందని, బీజేపీ 9 నుంచి 21 సీట్లను గెలుస్తుందని, కాంగ్రెస్ 0- 1 సీట్లను గెలిచే ఆస్కారం ఉందని స్పష్టం చేసింది.   

also read ఢిల్లీ ఎగ్జిట్ పోల్: మరోసారి ఊడ్చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ... కుండబద్దలుకొట్టిన రిపబ్లిక్- జన్ కి బాత్ సర్వే

ఏబీపీ- సి ఓటర్ సర్వే 

ఆప్ 49 నుంచి 60 స్థానాలను గెలుస్తుందని, బీజేపీ 5 నుంచి 19 స్థానాలు గెలుస్తుందని, కాంగ్రెస్ 0-4 స్థానాలను కైవసం చేసుకోవచ్చని తెలిపింది. 

ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరు మొదలయింది.

also readఢిల్లీ ఎగ్జిట్ పోల్: సిఎన్ఎన్- న్యూస్ 18 సర్వే... తిరిగి మరో సారి ముఖ్యమంత్రి కానున్న కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బిజెపిల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఆప్ గెలిస్తే మరో ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. బిజెపి తన సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉంది. కాంగ్రెసు 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. 


ఢిల్లీలో మొత్తం 13,571 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. లక్షా 24 మంది పోలింగ్ విధులు నిర్వహిచారు. ఢిల్లీలో మొత్తం ఓటర్లు 1,47,86,382 మంది ఉండగా అందులో మహిళలు 66 లక్షల 80 వేల 277 మంది, పురుషులు 81 వేల 5 వేల 236 మంది ఉన్నారు.

2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. బిజెపి 3 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెసు పార్టీ ఖాతానే తెరవలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios