Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంకలో కవరేజీ కోసం వెళ్లిన ఢిల్లీ జర్నలిస్టు అరెస్ట్

శ్రీలంకలో జరిగిన పేలుళ్ల కవరేజీ కోసం వెళ్లిన ఢిల్లీకి చెందిన ఫోటో జర్నలిస్టు సిద్దిఖీ అహ్మద్ డానిష్‌ను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఓ స్కూల్లో కవరేజీకి వెళ్లాడనే నెపంతో సిద్దిఖీని అరెస్ట్ చేశారని శ్రీలంక ప్రకటించింది.

Delhi-Based Photojournalist Covering Lanka Blasts Arrested For Trespass
Author
New Delhi, First Published May 3, 2019, 3:44 PM IST

కొలంబో:  శ్రీలంకలో జరిగిన పేలుళ్ల కవరేజీ కోసం వెళ్లిన ఢిల్లీకి చెందిన ఫోటో జర్నలిస్టు సిద్దిఖీ అహ్మద్ డానిష్‌ను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఓ స్కూల్లో కవరేజీకి వెళ్లాడనే నెపంతో సిద్దిఖీని అరెస్ట్ చేశారని శ్రీలంక ప్రకటించింది.

రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగిగా సిద్దిఖీ పనిచేస్తున్నాడు. శ్రీలంకలోని నిగొంబో సిటీలోని ఓ స్కూల్లో అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ సిద్దిఖీని లంక పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈస్టర్ రోజు సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన కాల్పుల్లో ఓ విద్యార్థి చనిపోయాడు. ఈ విద్యార్ధి గురించి వివరాలు తెలుసుకొనేందుకు సిద్దిఖీ లోపలికి వెళ్లబోయారని లంక పోలీసులు ఆరోపించారు. 

అనుమతి లేకుండా స్కూల్లోకి చొరబాటుకు ప్రయత్నించారనే అభియోగాలపై సిద్దిఖీ అరెస్ట్ అయ్యారని పోలీసులు తెలిపారు. అనంతరం ఈ నెల 15వ తేదీ వరకు నెగొంబో మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించారని అని  ఓ పోలీస్ అధికారి తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios