కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ సంబంధిత సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే వుందని వైద్యులు చెబుతున్నారు.  

కాంగ్రెస్ (congress) అధినేత్రి సోనియా గాంధీ (sonia gandhi) ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో (Ganga Ram Hospital) చేరారు. కోవిడ్ బారినపడటంతో ఆమె కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో సోనియా బాధపడుతున్నారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగానే వుందని వైద్యులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మరోవైపు రాష్ట్రప‌తి ఎన్నికల నేపథ్యంలో సోనియా గాంధీ శనివారం విప‌క్ష పార్టీల నేత‌ల‌కు లేఖ రాశారు. ప్ర‌స్తుతం దేశానికి ఒక మంచి రాష్ట్రప‌తి అవ‌స‌రం ఉంద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ్యాంగాన్ని, దేశ పౌరుల‌ను అధికార పార్టీ నుంచి ర‌క్షించే నాయ‌కుడు కావాల‌ని ఆమె పేర్కొన్నారు. ఈ లేఖ పంపిన వారిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (sharad pawar) , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) తో పాటు ప‌లు విప‌క్ష నాయ‌కులు ఉన్నారు. 

Also Read:presidential elections : రాజ్యాంగాన్ని ర‌క్షించే రాష్ట్రపతి అవ‌స‌రం - సోనియా గాంధీ.. విపక్షాలకు లేఖ

తాను కోవిడ్ తో బాధ‌ప‌డుతున్నందున ఇతర నాయకులతో సమన్వయం కోసం ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) మల్లికార్జున ఖర్గేను నియమించాన‌ని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య సంస్థలను, పౌరులను అధికార పార్టీ దాడుల నుంచి రక్షించగల అధ్య‌క్షుడు దేశానికి అవసరమని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కాగా రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థికి నిర్దిష్ట పేరును సూచించలేదని పార్టీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. భారత విచ్ఛిన్నమైన సామాజిక వస్త్రాన్ని న‌యం చేసే స్పర్శ'ను వర్తింపజేయగల అధ్యక్షుడిని ఎన్నుకోవడం అవ‌స‌రం తెలిపారు. ‘‘ చర్చలు ఓపెన్ మైండెడ్ గా, ఈ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి. ఇతర రాజకీయ పార్టీలతో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ చర్చను ముందుకు తీసుకెళ్లాలని మేము నమ్ముతున్నాము ’’ అని ఆమె పేర్కొన్నారు. 

ఇదిలా ఉండ‌గా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వచ్చే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జూన్ 15 న న్యూఢిల్లీలో తాను నిర్వ‌హించే సమావేశానికి హాజరు కావాలని అభ్యర్థిస్తూ ప్రతిపక్ష నాయకులకు శనివారం లేఖ రాశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా 22 మంది ప్రతిపక్ష నేతలకు బెనర్జీ లేఖ పంపారు. దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు పీడిస్తున్నప్పుడు జాతీయ రాజకీయాల భవిష్యత్తు గమనంపై చర్చించేందుకు అన్ని ప్రగతిశీల ప్రతిపక్షాలకు రాష్ట్రపతి ఎన్నికలు సరైన అవకాశాన్ని కల్పిస్తున్నాయని ఆమె అన్నారు.