Asianet News TeluguAsianet News Telugu

తప్పు పదం వాడాను.. క్షమించండి : ‘‘రాష్ట్రపత్ని’’ వ్యాఖ్యలపై ద్రౌపది ముర్ముకు అధిర్ రంజన్ లేఖ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారు. గురువారం రాష్ట్రపతిని ‘‘రాష్ట్రపత్ని’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై లోక్‌సభలో బీజేపీ ఎంపీలు భగ్గుమనడంతో అధిర్ వెనక్కి తగ్గారు. 
 

congress mp Adhir Ranjan Chowdhury apologises to President Droupadi Murmu
Author
New Delhi, First Published Jul 29, 2022, 7:02 PM IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. తప్పుపదం వాడినందుకు క్షమించండి అంటూ కోరారు. ఆ పదాన్ని తప్పుగా వాడానని లేఖలో అన్నారు. గురువారం రాష్ట్రపతిని ‘‘రాష్ట్రపత్ని’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై లోక్‌సభలో బీజేపీ ఎంపీలు భగ్గుమనడంతో అధిర్ వెనక్కి తగ్గారు. రాష్ట్రపతికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతానని గురువారం చెప్పారు. దీనిలో భాగంగానే శుక్రవారం అధిర్ క్షమాపణలు కోరారు. 

ఇకపోతే... రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ‘రాష్ట్రపత్ని’గా పేర్కొన్నందుకు తన తప్పును అంగీకరిస్తున్నాని అధిర్ రంజన్ చౌదరి గురువారం అన్నారు. తాను రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతానని అన్నారు. తాను బెంగాలీ వాడినని, హిందీ అలవాటు లేదని తెలిపారు. రాష్ట్రపతిని తాను స్వయంగా కలిసి క్షమించాలని కోరుతానని అన్నారు. కానీ ఈ 'పఖండీలకు' (కపటవాదులకు) క్షమాపణ చెప్పబోనని ఆయ‌న‌ను విమ‌ర్శించేవారిని ఉద్దేశించి అన్నారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని 'రాష్ట్రపత్ని' అని లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్న తర్వాత బీజేపీ కాంగ్రెస్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. కాంగ్రెస్ భారతదేశంలోని మహిళలు, గిరిజనులను కించపరిచింది అని పేర్కొంది. ‘‘ ఒక గిరిజ‌న నాయకురాలిని అవమానించినందుకు మీరు దోషులుగా ఉన్నారు...ఒక గిరిజన మహిళకు ఇచ్చిన గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతుంది. ఒక పేద గిరిజన మహిళ భారత రాష్ట్రపతి కావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది” అని లోక్‌సభలో స్మృతి ఇరానీ అన్నారు. 

సభ నేలపై, రాష్ట్రపతిపై అధిర్ రంజ‌న్ చౌద‌రి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో కోరారు. కాగా బీజేపీ ఆరోపణపై చౌదరి స్పందిస్తూ, “క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదు” అని చెప్పగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రంజన్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని అన్నారు.

ALso REad:‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలు.. అధిర్ రంజన్‌కు జాతీయ మహిళా కమీషన్ నోటీసులు

కాగా.. రంజన్ చౌదరికి (Adhir Ranjan Chowdhury) జాతీయ మహిళా కమీషన్‌ (National Commission for Women ) నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ నోటీసులు ఇచ్చింది. ‘‘ రాష్ట్రపత్ని’’ వ్యాఖ్యలకు గాను లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఎన్‌సీడబ్ల్యూ (ncw) ఆదేశించింది. ఇందుకు ఆగస్ట్ 3 ఉదయం 11.30 గంటల వరకు గడువు విధించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి (sonia gandhi) కూడా మహిళా కమీషన్ లేఖ రాసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. అధిర్ రంజన్ చౌదరి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్‌సీడబ్ల్యూతో పాటు 13 రాష్ట్ర మహిళా కమీషన్‌లు కూడా ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios