పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలి, పార్లమెంట్ సభ్యుడిగా అనర్హతకు గురైన నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ట్విట్టర్ బయోను మార్చుకున్నారు. అందులో ‘డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’ అంటూ చేర్చారు.
‘మోడీ ఇంటి పేరు’ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలారు. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడు అయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తన బయోను మార్చుకున్నారు. ‘డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’ అంటూ అందులో తన ప్రస్తుత హోదాను పేర్కొన్నారు.
చట్ట ప్రకారం ఒక ఎంపీకి రెండు లేదా అంతకంటే ఎక్కువగా జైలు శిక్ష పడితే ఆయన లోక్ సభ సభ్యత్వానికి అర్హత కోల్పోతారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయనపై అనర్హత వేటు పడటంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. గత శుక్రవారం రాహుల్ గాంధీని లోకసభలోకి అనుమతించలేదు. చట్టప్రకారం ఆయనపై అనర్హత వేటు వేసినందున ఆయన పార్లమెంటరీ కార్యకలాపాల్లో పాల్గొనలేరని పార్లమెంటు దిగువ సభ పేర్కొంది. అయితే ఈ చర్యను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రసంగంలో ‘మోడీ’ అనే ఇంటిపేరును హేళన చేసినందుకు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ 'దొంగలందరికీ మోడీ అనే ఉమ్మడి ఇంటిపేరు ఎలా ఉంటుంది' అని ప్రశ్నించారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ... వారందరికీ మోడీ అనే ఉమ్మడి ఇంటిపేరు ఎలా ఉంటుంది? దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 149 రోజుల్లో ఇదే అత్యధికం..
శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించినందుకు భారత శిక్షాస్మృతి సెక్షన్ 504 కింద సూరత్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్ హెచ్ వర్మ గాంధీని దోషిగా నిర్ధారించారు. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేయడంతో పాటు శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేశారు.
అనర్హత వేటు వల్ల రాహుల్ గాంధీపై పడే ప్రభావం ?
కాగా.. లోక్ సభ నుంచి రాహుల్ గాంధీ అనర్హతకు గురికావడం వల్ల ఆయన అనేక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆయన ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడంతో పాటు ఢిల్లీలోని తన అధికారిక బంగ్లాను కూడా కోల్పోయే అవకాశం ఉంది. అయితే 2024లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏడాదికి పైగా సమయం ఉంది. కావున వయనాడ్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించవచ్చు.
రాజ్ఘాట్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం.. పోలీసులు అనుమతి లేకున్నా కొనసాగుతున్న దీక్ష..
కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష..
తమ పార్టీ నేత రాహుల్ గాంధీని లోక్ సభ నుంచి అనర్హుడిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేడు దేశవ్యాప్తంగా ఒక రోజు సత్యాగ్రహం నిర్వహిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సత్యాగ్రహానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ తో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.