Asianet News TeluguAsianet News Telugu

షాక్: లవర్‌తో మాట్లాడుతున్నాడని యువకుడిపై కత్తితో దాడి

లవర్‌పై  సన్నిహితంగా ఉన్నాడని దాడి

Congress corporator's son stabs woman in Karnataka


బెంగుళూరు: కర్ణాటకలో తన ప్రియురాలితో మరో వ్యక్తి సన్నిహితంగా ఉంటున్నాడనే విషయాన్నిగమనించిన ప్రియుడు  అతడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన  ఆ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ లింగరాజు​కుమారుడు రాకేశ్‌ గత కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతికి ఓ క్లోజ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని రాకేశ్‌ తెలుసుకున్నాడు.

తన ప్రియురాలు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని భావించాడు. అప్పటినుంచీ ఆ యువకుడిపై తన పగ తీర్చుకోవాలని భావించాడు రాకేశ్‌. ఈ క్రమంలో పథకం ప్రకారం మంగళవారం తన గర్ల్‌ఫ్రెండ్‌ స్నేహితుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. 


రాకేశ్‌ కత్తిదాడిలో  తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై దేవనగేనేలోని కేటీజే నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios