షాక్: లవర్తో మాట్లాడుతున్నాడని యువకుడిపై కత్తితో దాడి
లవర్పై సన్నిహితంగా ఉన్నాడని దాడి
బెంగుళూరు: కర్ణాటకలో తన ప్రియురాలితో మరో వ్యక్తి సన్నిహితంగా ఉంటున్నాడనే విషయాన్నిగమనించిన ప్రియుడు అతడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లింగరాజుకుమారుడు రాకేశ్ గత కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతికి ఓ క్లోజ్ఫ్రెండ్ ఉన్నాడని రాకేశ్ తెలుసుకున్నాడు.
తన ప్రియురాలు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని భావించాడు. అప్పటినుంచీ ఆ యువకుడిపై తన పగ తీర్చుకోవాలని భావించాడు రాకేశ్. ఈ క్రమంలో పథకం ప్రకారం మంగళవారం తన గర్ల్ఫ్రెండ్ స్నేహితుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
రాకేశ్ కత్తిదాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై దేవనగేనేలోని కేటీజే నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.