బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చే ముస్లింలను నిరోధించేలా  చర్యలు తీసుకోలేదు.పైగా ఈ సమస్య పెరిగేలా వ్యవహరించిందని  సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన  స్కానింగ్ కమిటీ రిపోర్ట్ అభిప్రాయపడింది.


న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చే ముస్లింలను నిరోధించేలా చర్యలు తీసుకోలేదు.పైగా ఈ సమస్య పెరిగేలా వ్యవహరించిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్కానింగ్ కమిటీ రిపోర్ట్ అభిప్రాయపడింది.

ఈ రిపోర్ట్ మై నేషన్ వద్ద ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లను పొందేందుకుగాను అక్రమంగా బంగ్లా నుండి వలసలు వచ్చినా కూడ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిందనే ఆరోపణలు కూడ ఉన్నాయి. ఈ విషయమై గతంలో వికీలీక్స్ ఈ విషయమై ప్రస్తావించిన అంశాలను మై నేషన్ ప్రస్తావిస్తోంది. ముస్లిం ఓట్ల కోసం అప్పటి సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతను కూడ ఫణంగా పెట్టిందని మై నేషన్ గుర్తించింది. అక్రమంగా ప్రవేశించడమే కాకుండా తప్పుడు ధృవీకరణ పత్రాలను కూడ సంపాదిస్తున్నారని గుర్తించారు. 


రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా ఉన్నవారిని ఎలా విచారిస్తున్నాయనే దానిపై విచారణకు సంబంధించిన కమిషన్ సిఫార్సులను బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు.అక్రమ వలసదారులు తమను తాము నిలువరించే పద్ధతిలో ఒక స్వతంత్ర విచారణ ,దర్యాప్తు కోసం ఇచ్చిన సెక్షన్ 9 కి సంబంధించి ప్రాథమిక సమస్యలలో ఒకటి.

ఈ కనెక్షన్లో అసౌకర్యాలను గుర్తించడంతో సహా ప్రతిస్పందన సాధారణమైనది కాదు. మొత్తం జనాభా మార్పుల విషయంలో వాస్తవమైన డేటాను పరిగణనలోకి తీసుకుంటే, ప్రతినిధుల నుండి వివరణను స్వీకరించడానికి పెద్ద సంఖ్యలో "నాన్-ఇండియన్స్" యొక్క విస్తరణను గురించి అధికారిక సమాచారాలను కలిగి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని నివేదిక పేర్కొంది.

భారత దేశంలోకి అక్రమంగా వలసదారులు ఎలా వస్తున్నారనే విషయాన్ని మై నేషన్ ప్రత్యేకంగా బయటపెట్టింది. ముస్లిం ఓటు బ్యాంకుకు చట్టవిరుద్ధమైన అక్రమ వలసలను అక్రమంగా రద్దు చేయటంతో, చట్టబద్దమైన వలసదారుల (ట్రిబ్యునల్ బై డిటర్మినేషన్) చట్టంపై కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని 2006 లో వికీలీక్స్ ఆరోపించింది. 

అయితే ఈ విషయమై 2015 సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ సభ్యుడిని నియమించింది. సీనియర్ న్యాయవాది ఉపమన్యు హాజారికా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటైంది.

ఈ రిపోర్ట్ సుప్రీం కోర్టుకు సమర్పించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏ రకంగా అక్రమ వలసలను నిరోధించకుండా ఉన్నాయనే విషయాన్ని అసోం రాష్ట్ర డీఐజీ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అజయ్ సింగ్ హాజరికాకు వీడియో నివేదికను ఇచ్చాడు. 

ఏ రకంగా సరిహద్దుల నుండి వలసలు జరుగుతున్నాయనే విషయాన్ని ఆయన వివరించారు. సరిహద్దు గుండి భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత వారంతా నకిలీ సర్టిఫికెట్లను పొందుతున్నారు. నకిలీ సర్టిఫికెట్ల జారీ కోసం పెద్ద ముఠా పనిచేస్తోంది.

అయితే అక్రమ వలసల కారణంగా బోకో అసెంబ్లీ నియోజకవర్గంలో గౌహతికి 80 కి.మీ దూరంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఓటర్లు అసాధారణంగా పెరిగారు. ఈ నియోజకవర్గంలోని 14 పోలింగ్ స్టేషన్లలో 1971 నుండి 1997 వరకు 22 శాతం ఓట్లు పెరిగాయని ఈ నివేదికలో వెల్లడించింది. 22 శాతం ఓటర్ల నుండి 80 శాతం ఓటర్లు పెరిగారని ఈ నివేదిక స్పష్టం చేసింది.

కజిరంగా, నజాన్ పోలిసంగ్ స్టేషన్ల పరిధిలో హిందూ ఓటర్ల కంటే ముస్లిం ఓటర్ల సంఖ్య పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. ఈ పోలింగ్ స్టేషన్ల పరిధిలో హిందూ ఓటర్లు 132407 శాతం ఉంటే, ముస్లిం ఓటర్లు 409.76 శాతం పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది.