Asianet News TeluguAsianet News Telugu

త్వరలో సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. స్పష్టతనిచ్చిన ప్రభుత్వం..

సుప్రీంకోర్టుకు త్వరలో ఐదుగురు జడ్జిల నియామకం మీద క్లియరెన్స్ ఇస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో జడ్జిల సంఖ్య 32కు చేరుతుంది. 

Collegiums recommendation will be cleared soon, for appointment of 5 new judges, government - bsb
Author
First Published Feb 3, 2023, 1:29 PM IST

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు పదోన్నతి కోసం సిఫార్సు చేసిన ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు న్యాయమూర్తుల పేర్లను ప్రభుత్వం త్వరలో క్లియర్ చేయనుంది.  సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం చేస్తే.. సుప్రీంకోర్టు  వర్కింగ్ స్ట్రెంథ్ 32కి పెరుగుతుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సహా అత్యున్నత న్యాయస్థానానికి మంజూరైన జడ్జిల సంఖ్య 34. ప్రస్తుతం 27 మందిలో కోర్టు పనిచేస్తోంది.

న్యాయమూర్తుల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పదోన్నతిపై త్వరలో స్పష్టత వస్తుందని ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 13న ప్రభుత్వానికి ఐదు పేర్లను సిఫార్సు చేసింది - జస్టిస్ పంకజ్ మిథాల్, ప్రధాన న్యాయమూర్తి, రాజస్థాన్ హైకోర్టు, జస్టిస్ సంజయ్ కరోల్, ప్రధాన న్యాయమూర్తి, పాట్నా హైకోర్టు, జస్టిస్ పివి సంజయ్ కుమార్, ప్రధాన న్యాయమూర్తి, మణిపూర్ హైకోర్టు, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అహ్సానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మనోజ్ మిశ్రాలు ఈ ఐదుగురిలో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios